భారత డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటా ప్లాట్ఫామ్స్ (Meta) కలిసి గుజరాత్లోని జామ్నగర్లో అత్యాధునిక ఏఐ (AI) ఎనేబుల్డ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. ముంబై వేదికగా బుధవారం (10 జూన్ 2026) రిలయన్స్ ఈ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించింది.
రెండేళ్లలో అందుబాటులోకి..

ఈ భారీ డేటా సెంటర్ 168 మెగావాట్ల (MW) సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. రాబోయే రెండేళ్ల కాలపరిమితిలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వీలుంది. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటా అవసరాల కోసం భారతదేశంలో ప్రత్యేకంగా (Built-to-suit) నిర్మిస్తున్న మొదటి డేటా సెంటర్ ఇదే కావడం విశేషం. గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ ఎదుగుదలకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలవనుంది.
ఈ కేంద్రంలోని క్లౌడ్ సామర్థ్యాన్ని మెటా లీజుకు తీసుకోనుంది. తద్వారా మెటా తన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడంతో పాటు, తన కోర్ బిజినెస్, ఏఐ కంప్యూటింగ్ అవసరాలను తీర్చుకుంటుంది. రిలయన్స్, మెటా మధ్య ఎప్పటి నుంచో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని ఈ ప్రాజెక్ట్ మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
ఎండ్-టు-ఎండ్ సేవలతో రిలయన్స్ వన్-విండో
ఈ ఒప్పందం ప్రకారం, డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం నుంచి రోజువారీ నిర్వహణ వరకు అన్ని బాధ్యతలను రిలయన్స్ చూసుకోనుంది. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధనం, నెట్వర్క్ కనెక్టివిటీ, ఆపరేషనల్ సర్వీసుల వంటి ఎండ్-టు-ఎండ్ సేవలను రిలయన్స్ అందిస్తుంది. దీంతో హైపర్స్కేల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఒకే వేదికగా (Single-window solutions provider) రిలయన్స్ నిలిచింది.
జామ్నగర్ భౌగోళిక వ్యూహాత్మక స్థానం ఈ ప్రాజెక్టుకు ఎంతో కలిసిరానుంది. జియో విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్, సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, ఈ డేటా సెంటర్ను పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడిపిస్తారు. కూలింగ్ అవసరాల కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసి (Desalinated Seawater) వాడుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్లను వ్యూహాత్మక జాతీయ మౌలిక సదుపాయాలుగా గుర్తించి, పెట్టుబడులను ఆకర్షించేలా తెచ్చిన దీర్ఘకాలిక విధానాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ సాగుతోంది.
దిగ్గజాల హర్షం
{{/usCountry}}జామ్నగర్ భౌగోళిక వ్యూహాత్మక స్థానం ఈ ప్రాజెక్టుకు ఎంతో కలిసిరానుంది. జియో విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్, సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, ఈ డేటా సెంటర్ను పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడిపిస్తారు. కూలింగ్ అవసరాల కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసి (Desalinated Seawater) వాడుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్లను వ్యూహాత్మక జాతీయ మౌలిక సదుపాయాలుగా గుర్తించి, పెట్టుబడులను ఆకర్షించేలా తెచ్చిన దీర్ఘకాలిక విధానాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ సాగుతోంది.
దిగ్గజాల హర్షం
{{/usCountry}}"మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు. మెటా వంటి ప్రపంచ స్థాయి సంస్థ కోసం దేశంలోనే మొదటి డేటా సెంటర్ను నిర్మించడం, గ్లోబల్ ఏఐ విప్లవానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్త ఏఐ ఆవిష్కరణలకు జామ్నగర్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
"భారతదేశంలో మా మొదటి ఏఐ డేటా సెంటర్ను నిర్మించడానికి రిలయన్స్తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. జామ్నగర్లోని ఈ ప్రపంచ స్థాయి కేంద్రం మా గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత పెంచుతుంది" అని మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తెలిపారు.
రిలయన్స్, మెటా ఆర్థిక బలం
మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,75,919 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ. 95,754 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా దూసుకుపోతోంది. 2025 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 88వ స్థానంలో, ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 45వ స్థానంలో నిలిచింది. మరోవైపు, 2004లో ఫేస్బుక్గా ప్రారంభమై, నేడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్లతో బిలియన్ల కొద్దీ ప్రజలను అనుసంధానిస్తూ, మెటా సంస్థ ఏఐ సాంకేతికతతో సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది.