కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే వారికి రెనో ఇండియా షాకిచ్చింది. తన పోర్ట్ఫోలియోలోని పాపులర్ మోడల్స్ అయిన క్విడ్, ట్రైబర్, కైగర్ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జనవరి 2026 నుంచి ఈ పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
ఎందుకు ధరల పెంపు?

ముడిసరుకు ఖర్చులు (Input costs) పెరగడం, మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని రెనో వెల్లడించింది. మోడల్, వేరియంట్ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా 2 శాతం వరకు ఉండవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, అన్ని వేరియంట్లపై ఒకే రకమైన పెంపు ఉండదు, కచ్చితమైన కొత్త ధరల జాబితాను జనవరిలో విడుదల చేయనున్నారు.
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో మూడు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వాటి ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇక్కడ చూడండి:
రెనో క్విడ్ (Kwid): బ్రాండ్లోనే అత్యంత చవకైన కారు. దీని ధర రూ. 4.29 లక్షల నుండి రూ. 5.99 లక్షల వరకు ఉంది.
రెనో ట్రైబర్ (Triber): ఫ్యామిలీ కోసం సరిపోయే కాంపాక్ట్ ఎంపీవీ (MPV). దీని ధర రూ. 5.76 లక్షల నుండి రూ. 8.59 లక్షల మధ్య ఉంది.
రెనో కైగర్ (Kiger): స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవీ (SUV). దీని ప్రారంభ ధర రూ. 5.76 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 10.33 లక్షల వరకు పలుకుతోంది.
ఇటీవలే కొత్త జీఎస్టీ (GST) నిబంధనల వల్ల కొన్ని మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే, తాజా పెంపుతో ఆ తగ్గింపు ప్రయోజనాలు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
వస్తోంది.. కొత్త తరం ‘డస్టర్’
{{/usCountry}}ఇటీవలే కొత్త జీఎస్టీ (GST) నిబంధనల వల్ల కొన్ని మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే, తాజా పెంపుతో ఆ తగ్గింపు ప్రయోజనాలు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
వస్తోంది.. కొత్త తరం ‘డస్టర్’
{{/usCountry}}ధరల పెంపు వార్త కాస్త నిరాశ కలిగించినా, ఆటోమొబైల్ ప్రియుల కోసం రెనో ఒక తీపి కబురు చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ డస్టర్ (Duster) ఎస్యూవీని జనవరి 2026లోనే భారత్లో ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన తొలి అఫీషియల్ టీజర్ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇప్పటికే యూరప్ మార్కెట్లలో 'డేసియా డస్టర్' పేరుతో విక్రయిస్తున్న ఈ కారు, సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో భారత రోడ్లపైకి రానుంది.