FASTag : మీ ఫాస్టాగ్​లో ఉచితంగా రూ. 1000 క్రెడిట్ చేస్తారు​! ఇలా చేస్తే చాలు..

FASTag updates : భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పటికీ, హైవేలపై ఉండే టాయిలెట్ల పరిశుభ్రత అనేది ప్రయాణికులకు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే..

Published on: Apr 07, 2026 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల సౌకర్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్​ ప్లాజాల దగ్గర ఉన్న అపరిశుభ్ర టాయిలెట్లను రిపోర్టు చేసిన వారికి, వారి ఫాస్టాగ్​లో రూ. 1000 రివార్డు లభించే విధంగా చర్యలు తీసుకోనుంది.

ఫాస్టాగ్​లో ఫ్రీగా రూ. 1000 క్రెడిట్​ చేస్తారు!
ఫాస్టాగ్​లో ఫ్రీగా రూ. 1000 క్రెడిట్​ చేస్తారు!

అపరిశుభ్ర టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే..

మంత్రిత్వ శాఖ తాజాగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే, ప్రయాణికులు వాటిని నివేదించాలని కోరింది.

ఎలా ఫిర్యాదు చేయాలి?: ప్రయాణికులు అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటోను తీసి 'రాజమార్గయాత్ర' (Rajmargyatra) యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.

బహుమతి: అధికారులు ఆ ఫోటోను వెరిఫై చేసిన తర్వాత, ఫిర్యాదు చేసిన యూజర్ ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ. 1,000 క్రెడిట్ జమ అవుతుంది.

పౌరులను భాగస్వామ్యం చేయడం ద్వారా హైవేలపై పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు బంద్!

మరోవైపు.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు తీసుకోరు1

కేవలం ఫాస్టాగ్​, యూపీఐ ద్వారా మాత్రమే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

నగదు లావాదేవీలను పూర్తిగా నియంత్రించడం ద్వారా టోల్ గేట్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించి, ట్రాఫిక్ ఫ్లోను మెరుగుపరచాలని ఎన్​హెచ్​ఏఐ భావిస్తోంది.

యూపీఐ చెల్లింపులపై జరిమానా జాగ్రత్త!

ఇక్కడ ప్రయాణికులు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. టోల్ ట్యాక్స్‌ను యూపీఐ ద్వారా చెల్లిస్తే, అసలు టోల్ ధరపై 25 శాతం పెనాల్టీ పడుతుంది!

ఉదాహరణకు: మీ టోల్ ధర రూ. 100 అనుకుంటే, మీరు యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ. 125 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫాస్టాగ్ వాడటమే అత్యంత లాభదాయకం.

మరికొన్ని కీలక మార్పులు..

టోల్ మినహాయింపులు: ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు చూపించి ప్రైవేట్ వాహనాలపై టోల్ మినహాయింపు పొందడంపై ఆంక్షలు విధించారు. ఇకపై కేవలం 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్: తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం డిజిటల్ 'ఫాస్టాగ్ యాన్యువల్ పాస్'ను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More