క్యాన్సర్ చికిత్సారంగంలో భారతదేశం అద్భుత ఘనత సాధించింది. సాధారణంగా వాడే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్కు గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేసే 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

'ఆర్కే-251' (RK-251) గా నామకరణం చేసిన ఈ ఔషధం, శరీరంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ కణజాలాలలో నిద్రాణంగా (Inactive) ఉంటూ, క్యాన్సర్ ఉన్న చోటికి చేరుకోగానే ఉత్తేజితమవుతుంది (Switched on).
ఐఏఎస్ఎస్టీ, ఐఐటీ గువాహటి సంయుక్త ఆవిష్కరణ
ఈ విప్లవాత్మక ఔషధాన్ని గువాహటిలోని [ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST)] శాస్త్రవేత్త డాక్టర్ ఆసిస్ బాలా, ఐఐటీ గువాహటి (IIT Guwahati) నిపుణుడు డాక్టర్ కేపీ భబక్ నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధి చేసింది.
ఆర్కే-251 ఎలా పనిచేస్తుంది?
క్యాన్సర్ కణాలలో 'రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్' (ROS) అనే హానికారక అణువుల స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఆర్కే-251 ఔషధం క్యాన్సర్ కణంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడ ఉన్న అధిక ROS స్థాయిలు ఈ మందును ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తాయి.
ఇలా యాక్టివేట్ కాగానే, ఈ ఔషధం నుండి 'ఎన్బిడిహెచ్ఈఎక్స్' (NBDHEX) అనే శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక సమ్మేళనం విడుదలవుతుంది. క్యాన్సర్ కణాలు బతికి ఉండటానికి, చికిత్సను తట్టుకోవడానికి ఉపయోగించే ప్రోటీన్లను ఈ సమ్మేళనం సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
పరిశోధనల్లో కీలక ఫలితాలు
మనుషులపై ప్రయోగాలకు ముందు నిర్వహించిన ప్రీ-క్లినికల్ అధ్యయనాలలో ఆర్కే-251 అత్యుత్తమ ఫలితాలను కనబరిచింది. అత్యంత వేగంగా వ్యాపించే 'ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్' (Triple-negative breast cancer) కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపగా, ఆరోగ్యకరమైన కణాలకు దాదాపు ఎలాంటి హాని తలపెట్టలేదని తేలింది.
జెబ్రాఫిష్ (Zebrafish) పిండాలపై జరిపిన విషపూరిత అంచనా (Toxicity) పరీక్షల్లో కూడా ఈ ఔషధం ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపలేదు. ఆర్ఓఎస్ సమక్షంలో ఇది అనుకున్న రీతిలోనే ఫ్లోరోసెన్స్ (కాంతి)ని వెలువరించిందని, కాబట్టి తదుపరి పరిశోధనలకు ఇది సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ముందు మరిన్ని దశల ప్రయోగాలు జరపాల్సి ఉంది.
భారత్లో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి
{{/usCountry}}జెబ్రాఫిష్ (Zebrafish) పిండాలపై జరిపిన విషపూరిత అంచనా (Toxicity) పరీక్షల్లో కూడా ఈ ఔషధం ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపలేదు. ఆర్ఓఎస్ సమక్షంలో ఇది అనుకున్న రీతిలోనే ఫ్లోరోసెన్స్ (కాంతి)ని వెలువరించిందని, కాబట్టి తదుపరి పరిశోధనలకు ఇది సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోగులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ముందు మరిన్ని దశల ప్రయోగాలు జరపాల్సి ఉంది.
భారత్లో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి
{{/usCountry}}ప్రస్తుతం దేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆరోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. మనదేశంలో ప్రతి ఏటా 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, 7 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార (గర్భాశయ) క్యాన్సర్, పేగు క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, పొగాకు వాడకం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.