WPL 2026: వాట్ ఏ థ్రిల్లర్.. లాస్ట్ ఓవర్ డ్రామా.. ఆర్సీబీ అదుర్స్.. రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్
WPL 2026 ఫైనల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొట్టింది. డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది.
వాట్ ఏ థ్రిల్లర్.. వాట్ ఏ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. సీట్ అంచున కూర్చోబెట్టే పోరు.. లాస్ట్ ఓవర్ డ్రామా.. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్టరీ. వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 టైటిల్ ను ఆర్సీబీ దక్కించుకుంది. గురువారం రాత్రి ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. 2024లోనూ ఆర్సీబీ విజేతగా నిలిచింది.

కెప్టెన్ స్మృతి మంధాన అదుర్స్
డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాలంటే ఈ టోర్నీ హిస్టరీలో ఇంతకుముందెప్పుడూ ఆర్సీబీ ఛేజ్ చేయని స్కోరును ఈ మ్యాచ్ లో చేయాలి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ విజయంపై ధీమాతోనే ఉండి ఉంటుంది. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆర్సీబీ అమేజింగ్ విక్టరీ సాధించింది.
ధనాధన్ బ్యాటింగ్
భారీ ఛేజింగ్ లో ఆర్సీబీకి గ్రేస్ హారిస్ (9) వికెట్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. అయినా స్మృతి మంధాన (41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87) చెలరేగిపోయింది. జార్జియా (54 బంతుల్లో 14 ఫోర్లతో 79)తో కలిసి ఆర్సీబీని విక్టరీ వైపు నడిపించింది స్మృతి మంధాన. ముఖ్యంగా స్మృతి దూకుడుగా ఆడింది. ఎడాపెడా బౌండరీలు బాదేసింది. దీంతో చూస్తుండగానే టార్గెట్ కరుగుతూ వచ్చింది.
లాస్ట్ ఓవర్ డ్రామా
అయితే కీలక సమయంలో స్మృతి మంధాన ఔటైపోయింది. టపటపా మరో రెండు వికెట్లు పడ్డాయి. లాస్ట్ ఓవర్లో ఆర్సీబీ 10 పరుగులు చేస్తే గెలవాల్సిన పరిస్థితి. తెలుగమ్మాయి శ్రీచరణి బౌలింగ్ చేసింది. ఫస్ట్ రెండు బాల్స్ కు రెండు పరుగులే రావడంతో ఉత్కంఠ పెరిగింది. ఏ టీమ్ గెలుస్తుందోననే టెన్షన్ ఊపేసింది. కానీ మూడు, నాలుగు బాల్స్ కు రాధా యాదవ్ ఫోర్లు కొట్టి ఆర్సీబీకి అదిరే విజయాన్ని అందించింది.
నాలుగో ఫైనల్లోనూ
డబ్ల్యూపీఎల్ లో ఫైనల్ చేరడం, ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ కు అలవాటుగా మారింది. వరుసగా నాలుగో సారి ఫైనల్లోనూ ఈ టీమ్ కు పరాజయం తప్పలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 57), లారా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), హెన్రీ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) చెలరేగి టీమ్ కు భారీ స్కోరు అందించారు. కానీ ఢిల్లీని మరోసారి బ్యాడ్ లక్ వెంటాడింది. ఆర్సీబీ చేతిలో ఓడింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


