ప్రస్తుతం ఇంటర్నెట్ దునియాలో హాట్ టాపిక్గా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యంగ్య పూరిత వేదిక (Satirical Outfit) పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు, భిన్న అభిప్రాయాలు సహజమని ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి అంతా తట్టుకునే శక్తి ఉంది

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అంబేకర్ మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. "మనం ఒక చైతన్యవంతమైన సమాజంలో ఉన్నాం. పారదర్శకమైన ఎన్నికలు, స్వతంత్ర మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా.. ఇవన్నీ మన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగాలు. ఇలాంటి ఓపెన్ ఫోరమ్స్లో ప్రతిరోజూ చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడాన్ని చూసి మనం షాక్ అవ్వాల్సిన పనిలేదు. వీటిని సాధారణ ప్రక్రియగానే చూడాలి" అని అంబేకర్ వివరించారు.
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)?
ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, యువత (Gen Z) సోషల్ మీడియా వేదికగా సృష్టించిన ఒక వ్యంగ్య సమూహం. అయితే, దీనికున్న క్రేజ్ చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఈ గ్రూపునకు ఉన్న ఫాలోయింగ్ అధికార భారతీయ జనతా పార్టీతో సహా పలు ప్రధాన పార్టీల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. సిస్టమ్లోని లోపాలను ఎత్తిచూపుతూ యువత చేసే పోస్ట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యువతపై మాకు పూర్తి నమ్మకం ఉంది
దేశ యువతరం (Gen Z) పై ఆర్ఎస్ఎస్కు పూర్తి విశ్వాసం ఉందని అంబేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘భారత యువత దేశం పట్ల ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి స్వరాన్ని, భావోద్వేగాన్ని కలుపుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రజలు మన వ్యవస్థపై నమ్మకం ఉంచాలి’ అని పేర్కొన్నారు.
రాజకీయ వివాదం.. ఆర్ఎస్ఎస్ మౌనం
సీజేపీ (CJP) వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదమని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది.
{{/usCountry}}సీజేపీ (CJP) వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదమని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది.
{{/usCountry}}అయితే, ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నకు అంబేకర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజాస్వామ్య సంస్థలు ఇలాంటి విషయాలను పరిష్కరించుకోగలవు. మన వ్యవస్థలు ఏవీ బలహీనంగా లేవు. కాబట్టి ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ వెంటనే స్పందించాల్సిన లేదా తలదూర్చాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా వంటి విపక్ష నేతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, స్టాండప్ కమెడియన్లు సిజేపీకి మద్దతుగా నిలుస్తుండటంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.