హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీడీఎమ్ఓ (CDMO), బ్రాండెడ్ జెనెరిక్స్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని కంపెనీ అనుబంధ సంస్థ 'నూమెడ్ ఫార్మాస్యూటికల్స్ పిటివై లిమిటెడ్', ఆస్ట్రేలియాకు చెందిన మల్టీ-బిలియన్ డాలర్ల దిగ్గజ ఫార్మసీ చైన్తో తన ఓటీసీ (OTC) మందుల సరఫరా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు ప్రకటించింది.
రూ. 204 కోట్ల విలువైన ఒప్పందం వివరాలు

ఈ నూతన ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుంది. మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఈ ఒప్పందం మొత్తం విలువ 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 204.0 కోట్లు) గా అంచనా వేశారు. దీనిప్రకారం ప్రతి ఏటా సరాసరి 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైన సరఫరా జరుగుతుంది. ఒప్పంద వ్యవధిలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పోర్ట్ఫోలియో విస్తరణకు స్పష్టమైన అవకాశం కల్పించారు.
ఈ భాగస్వామ్యం ద్వారా ఉత్పత్తుల తయారీ, సోర్సింగ్, నియంత్రణ సంస్థల ఆమోదాలు, టీజీఏ (TGA) రిజిస్ట్రేషన్లు, వేర్హౌసింగ్, నాణ్యతా ప్రమాణాలు, దేశవ్యాప్త పంపిణీ బాధ్యతలను నూమెడ్ నిర్వహిస్తుంది. నూమెడ్ సంస్థ ప్రాడక్ట్ రిజిస్ట్రేషన్లు, మార్కెటింగ్ అనుమతులను కలిగి ఉండగా, సదరు ఫార్మసీ చైన్ తమ సొంత కన్స్యూమర్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తుంది.
మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 1,506 కోట్లకు చేరిక
జూలై 1, 2026న 7.5 ఏళ్ల కాలానికి కుదుర్చుకున్న రూ. 1,300 కోట్ల (202 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) ఒప్పందంతో కలిపి, ఆస్ట్రేలియా ఓటీసీ మార్కెట్లో సాయి పేరెంటరల్స్ మొత్తం కాంట్రాక్ట్ ఆర్డర్ బుక్ విలువ 232 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,506 కోట్లు) చేరింది.
ప్రస్తుతం ఈ ఒప్పందాలకు అవసరమైన ఉత్పత్తులను మూడో పక్ష తయారీదారుల నుంచి సేకరిస్తూ నూమెడ్ పంపిణీ మార్జిన్ మాత్రమే పొందుతోంది. అడిలైడ్లోని ప్లాంట్ ప్రారంభం కావడం, భారతీయ తయారీ సామర్థ్యం విస్తరించడంతో ఈ ఉత్పత్తుల తయారీ కంపెనీ సొంత ప్లాంట్లకు మారుతుంది. దీనివల్ల అదే కాంట్రాక్ట్ ఆదాయంపై పంపిణీ మార్జిన్ స్థానంలో అధిక లాభదాయకమైన తయారీ మార్జిన్ లభిస్తుంది.
కంపెనీ యాజమాన్యం వ్యాఖ్యలు
{{/usCountry}}ప్రస్తుతం ఈ ఒప్పందాలకు అవసరమైన ఉత్పత్తులను మూడో పక్ష తయారీదారుల నుంచి సేకరిస్తూ నూమెడ్ పంపిణీ మార్జిన్ మాత్రమే పొందుతోంది. అడిలైడ్లోని ప్లాంట్ ప్రారంభం కావడం, భారతీయ తయారీ సామర్థ్యం విస్తరించడంతో ఈ ఉత్పత్తుల తయారీ కంపెనీ సొంత ప్లాంట్లకు మారుతుంది. దీనివల్ల అదే కాంట్రాక్ట్ ఆదాయంపై పంపిణీ మార్జిన్ స్థానంలో అధిక లాభదాయకమైన తయారీ మార్జిన్ లభిస్తుంది.
కంపెనీ యాజమాన్యం వ్యాఖ్యలు
{{/usCountry}}"నూమెడ్ సంస్థ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు కీలక సరఫరా ఒప్పందాలను పునరుద్ధరించుకుంది. ఇవి ఆస్ట్రేలియా ఓటీసీ మార్కెట్లో మన ఆర్డర్ బుక్ను రూ. 1,506 కోట్లకు చేర్చాయి. అత్యంత కఠినమైన నియంత్రణలు ఉన్న ఆస్ట్రేలియా మార్కెట్లో ఏళ్లనుంచి అందిస్తున్న నాణ్యమైన సేవలకు ఇది నిదర్శనం. అడిలైడ్ ప్లాంట్ ప్రారంభమై, భారత తయారీ సామర్థ్యం పెరిగినకొద్దీ పంపిణీ మార్జిన్ స్థానంలో తయారీ మార్జిన్ వచ్చి కంపెనీ లాభదాయకత మరింత పెరుగుతుంది" అని సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల పేర్కొన్నారు.
"మా ఉత్పత్తుల విస్తృతి, కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకానికి ఈ ఒప్పంద పునరుద్ధరణ అద్దం పడుతోంది. సోర్సింగ్ నుంచి దేశవ్యాప్త పంపిణీ వరకు సమగ్ర బాధ్యతలను ఒక్క భాగస్వామే పర్యవేక్షించడాన్ని కస్టమర్లు కోరుకుంటున్నారు. అడిలైడ్లో స్థానిక తయారీ అందుబాటులోకి రాగానే లీడ్ టైమ్ తగ్గి, మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది" అని నూమెడ్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మార్క్ థుల్బోర్న్ వివరించారు.
సాయి పేరెంటరల్స్ ప్రస్థానం
నవంబర్ 2025లో నూమెడ్ సంస్థను స్వాధీనం చేసుకున్న సాయి పేరెంటరల్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో ప్రముఖ ప్రైవేట్-లేబుల్ ఓటీసీ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. మార్చి 2026లో ఐపీఓ పూర్తి చేసుకున్న ఈ సంస్థ, ఏప్రిల్ 2, 2026న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయింది. ప్రస్తుతం కంపెనీ భారత్లో 5, ఆస్ట్రేలియాలో 1 ప్లాంట్తో సహా మొత్తం 6 తయారీ కేంద్రాలు, 302 వాణిజ్య ఉత్పత్తులు, 599 ఆమోదిత రిజిస్ట్రేషన్లతో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తోంది.