SAI Recruitment 2026 : క్రీడా కోచ్​లకు గొప్ప అవకాశం- ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ వివరాలు..

క్రీడా రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్​ఏఐ) సిద్ధమైంది. వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ కోచ్‌ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది క్రీడా కోచ్‌లకు ఒక గొప్ప అవకాశం. ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026 కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 20, 2026, 07:30:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ క్రీడా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్​ఏఐ) కీలక అడుగు వేసింది. అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందించేందుకు గాను వివిధ క్రీడల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 'అసిస్టెంట్ కోచ్‌'ల రిక్రూట్​మెంట్​ని చేపడుతోంది. క్రీడా రంగంలో రాణించి, దేశానికి పతకాలు అందించే ఛాంపియన్లను తయారు చేయాలనుకునే నిపుణులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026..
ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026..

ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026- పోస్టుల వివరాలు..

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భాగంగా మొత్తం మీద 323 అసిస్టెంట్​ కోచ్​ పోస్టులను ఎస్​ఏఐ భర్తీ చేయనుంది. అవి..

స్విమ్మింగ్​- 26

అథ్లెటిక్స్​- 28

సైక్లింగ్​- 12

జిమ్నాస్టిక్స్​- 12

రెజ్లింగ్​- 22

కనోయింగ్​- 7

జూడో- 6

రోయింగ్​- 11

షూటింగ్​- 28

బాక్సింగ్​- 19

ఫెన్సింగ్​- 11

వెయిట్​లిఫ్టింగ్​- 10

టైక్వాండో- 11

ఆర్చరీ- 12

టేబుల్​ టెన్నిస్​- 14

బాట్మింటన్​- 16

టెన్నిస్​- 8

బాస్కెట్​బాల్​- 12

వాలీబాల్​- 10

ఫీల్డ్​ హాకీ- 13

ఫుట్​బాల్​- 12

హ్యాండ్​బాల్​- 6

కబడ్డీ- 6

కోకో- 2

సేపక్​ టక్​రో- 3

వుషు- 6

ఒక్కో విభాగంలోని ఒక్కో పోస్టులో ఓబీసీ, ఎస్​సీ, ఎస్​టీ వంటి విభజనలు ఉంటాయి.

ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026- రిజిస్ట్రేషన్​ వివరాలు..

రిజిస్ట్రేషన్​ తేదీలు- ఎస్​ఏఐ అసిస్టెంట్​ కోచ్​ రిక్రూట్​మెంట్​ 2026 అప్లికేషన్​ ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభం అవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 అని గుర్తుపెట్టుకోవాలి.

వయస్సు పరిమితి- అప్లికేషన్​ ప్రారంభ తేదీ సమయానికి అభ్యర్థి వయస్సు 30 మించకూడదు. కాగా నిబంధనల ప్రకారం ఈ పరిమితిలో సవరణలు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ- అసిస్టెంట్​ కోచ్​ల రిక్రూట్​మెంట్​లో భాగంగా అభ్యర్థులు మొదట కంప్యూటర్​ ఆధారిత పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఇది మొత్తం 100 మార్కులకు ఉంటుంది (65 మార్కులు స్పోర్ట్స్​ ఆధారిత ప్రశ్నలు, 25 మార్కులు స్పోర్ట్స్​ సైన్స్​, 10 మార్కులు జనరల్​ అవేర్​నెస్​, రీజనింగ్​, ఆప్టిట్యూడ్​).

సీబీటీ తర్వాత సీఏటీ (కోచింగ్​ ఎబిలిటీ టెస్ట్)​ ఉంటుంది.

ఎస్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026- ఫీజు వివరాలు..

  • ఓసీ, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ- రూ. 2,500
  • ఎస్​సీ, ఎస్​టీ, ఎక్స్​-సర్వీస్​మెన్​- రూ. 2000
  • మహిళా అభ్యర్థులు- రూ. 2000

ఎస్​ఏఐ అసిస్టెంట్​ కోచ్​ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన మరిన్ని వివరాలను నోటిఫికేషన్​లో తెలుసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​ కోసం ఇక్కడ్​ క్లిక్​ చేయండి.

ఎస్‌ఏఐ ఎందుకు ప్రత్యేకం?

దేశంలో ఒక కోచ్‌గా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశించే ఎవరికైనా ఎస్‌ఏఐ కంటే మెరుగైన వేదిక మరొకటి ఉండదు! ఇక్కడ కేవలం శిక్షణ మాత్రమే కాదు, స్పోర్ట్స్ సైన్స్​తో కూడిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లతో కలిసి పనిచేసే అవకాశం లభించడమే కాకుండా, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.

ఎస్‌ఏఐ కేవలం ఉద్యోగం ఇచ్చే సంస్థ మాత్రమే కాదు. భారత క్రీడా భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన వేదిక. 'ఖేలో ఇండియా', 'నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారిని పతకాల దిశగా నడిపించడంలో కోచ్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని అంతర్జాతీయ వేదికలపై విజేతలుగా నిలబెట్టే బాధ్యత వీరిపై ఉంటుంది.

క్రీడా విజన్​లో భాగంగా..

భారతదేశాన్ని క్రీడా శక్తిగా మార్చాలనే విజన్‌లో కోచింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. అందుకే ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రతిభావంతులైన, అంకితభావం గల నిపుణులను ఎంపిక చేయాలని ఎస్‌ఏఐ భావిస్తోంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని భారత క్రీడా ప్రస్థానంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More