...
...
Next Story

ఇరాన్‌పై ట్రంప్ క్షిపణి దాడులు: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, భగ్గుమన్న ముడిచమురు

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోగా, గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆరు వారాల గరిష్ఠానికి చేరాయి.

Published on: Sep 2, 2026, 09:25:52 IST
Advertisement

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ దట్టంగా కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లను భయం గుప్పిట్లోకి తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం రాత్రికి రాత్రే క్షిపణి దాడులకు తెగబడటం, దానికి ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో దలాల్ స్ట్రీట్ బుధవారం తీవ్ర ఉలిక్కిపాటుకు గురైంది. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు కుప్పకూలగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 200 పాయింట్ల మేర నష్టపోయింది.

ప్రీ-ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలు

సెన్సెక్స్ సూచీలో నిన్నటి టాప్ లూజర్స్ (PTI)
సెన్సెక్స్ సూచీలో నిన్నటి టాప్ లూజర్స్ (PTI)

మామూలు ట్రేడింగ్ ప్రారంభం కావడానికి ముందే మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ప్రీ-ఓపెనింగ్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 540 పాయింట్లకు పైగా నష్టపోయి 76,397.24 వద్దకు చేరగా, నిఫ్టీ 203 పాయింట్లు క్షీణించి 23,852.05 స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగింపు సమయానికి నిఫ్టీ 24,055.8 వద్ద నిలవగా, బుధవారం ఉదయం 7:38 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) ఫ్యూచర్స్ 24,033.5 పాయింట్ల వద్ద ట్రేడవుతూ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవుతాయనే విషయాన్ని ముందే సూచించాయి.

ఆరు వారాల గరిష్ఠానికి ముడిచమురు ధరలు

ఇరు దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులు తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 96.6 డాలర్లకు చేరుకుంది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలతో ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. క్రూడాయిల్ మంటల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పతాక స్థాయికి చేరే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్వెస్టర్లపై వడ్డీ రేట్ల భయం

ముడిచమురు ధరల పెంపుతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది బాండ్ ఈల్డ్‌లు పెరగడానికి దారితీసింది. వడ్డీ రేట్లు పెరిగితే భారత్ వంటి వర్ధమాన దేశాల (Emerging Markets) నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉండటంతో, ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మున్ముందు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి?

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe