భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జూన్ 12) రికార్డు స్థాయి ర్యాలీ నమోదైంది. అంతర్జాతీయంగా వెలువడిన సానుకూల పవనాలతో దలాల్ స్ట్రీట్ వన్వే ర్యాలీతో దూసుకెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,695.40 పాయింట్లు (2.30 శాతం) లాభపడి 75,527.95 వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 461.30 పాయింట్లు (1.99 శాతం) పుంజుకుని 23,622.90 వద్ద స్థిరపడింది.
మార్కెట్ దూకుడుకు కారణాలివే..
అమెరికా-ఇరాన్ మధ్య వచ్చే వారమే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లలో సరికొత్త జోష్ నింపాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా 5 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల దిగువకు పడిపోవడంతో, చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్కు ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. ఐటీ రంగాన్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని రంగాల షేర్లలోనూ భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత తెస్తున్న మార్పుల వల్ల ఐటీ షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి.
ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు.. ఇరాన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరుదేశాల ప్రతినిధులు ఒక అద్భుతమైన పరిష్కారానికి వచ్చారని ప్రకటించారు.
"పత్రాల తుది రూపకల్పన మాత్రమే మిగిలి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఒప్పందంపై సంతకాలు కాగానే హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరుస్తాం" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికాతో వివాదానికి ముగింపు పలికే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, వచ్చే వారం జరగనున్న ఎఫ్7 (F7) సమావేశం సందర్భంగా ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.
ఇన్వెస్టర్ల సొమ్ము రూ. 9.7 లక్షల కోట్లు అప్
{{/usCountry}}మరోవైపు, అమెరికాతో వివాదానికి ముగింపు పలికే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, వచ్చే వారం జరగనున్న ఎఫ్7 (F7) సమావేశం సందర్భంగా ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.
ఇన్వెస్టర్ల సొమ్ము రూ. 9.7 లక్షల కోట్లు అప్
{{/usCountry}}ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 452.33 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాప్, శుక్రవారం నాటి కొనుగోళ్ల హోరుతో ఏకంగా రూ. 462.05 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపదకు రూ. 9.71 లక్షల కోట్లు అదనంగా చేరింది.