...
...
Next Story

Electric scooter : ఏథర్​ రిజ్టాకు గట్టి పోటీగా.. కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్! లాంచ్ ఎప్పుడంటే..

Simple Energy Family Electric Scooter Launch : భారత ఈవీ మార్కెట్‌లోకి సింపుల్ ఎనర్జీ సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పరిచయం చేయనుంది. రేంజ్, ప్రయాణ సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్తాకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Published on: Jul 23, 2026, 05:44:09 IST
Advertisement

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగాన్ని ఏలుతున్న ఫ్యామిలీ స్కూటర్ విభాగాన్ని గురిపెడుతూ ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ అవసరాలకు, రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సెప్టెంబర్ 2, 2026న మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. అద్భుతమైన రేంజ్, అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాన్ని కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా వస్తున్న ఈ మోడల్.. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన ఆదరణ పొందుతున్న ఏథర్ రిజ్టాకు బలమైన పోటీ ఇవ్వనుంది! దీనితో పాటు టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా వీ2 వంటి పాపులర్ మోడళ్లకు కూడా ఇది గట్టి సవాలు విసరనుంది.

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Representative Image)
సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Representative Image)

ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శైలి మార్చిన సింపుల్ ఎనర్జీ..

ఇప్పటివరకు సింపుల్ ఎనర్జీ అంటే ప్రధానంగా స్పోర్టీ లుక్, హై పర్ఫార్మెన్స్ స్కూటర్లకే పేరుగాంచింది. అయితే ఈ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్​తో కంపెనీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. ఇప్పటివరకు సింపుల్ వన్ వేరియంట్లతో పాటు ఏకంగా 400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇచ్చే సింపుల్ అల్ట్రా వంటి ప్రీమియం మోడళ్లను అందించిన సంస్థ, ఇప్పుడు సామాన్య కుటుంబాల రోజువారీ అవసరాలపై దృష్టి సారించింది.

బ్యాటరీ, రేంజ్ వివరాలు..

ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ కోసం కంపెనీ ఒక సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.

బ్యాటరీ పరిమాణం: సింపుల్ వన్ ఎస్​లో వాడిన 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కంటే కాస్త చిన్న సైజ్ బ్యాటరీని ఇందులో అమర్చే అవకాశముంది.

పర్ఫార్మెన్స్: వేగం కంటే కూడా ఇంధన సామర్థ్యానికే ఇంజనీర్లు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడీసీ ప్రమాణాల ప్రకారం 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు, పనులకు వెళ్లేవారికి, చిన్న చిన్న కుటుంబ ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది.

డిజైన్, స్టోరేజ్..

ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ విక్రయిస్తున్న సింపుల్ వన్ ఎస్ ప్రారంభ ధర రూ. 1.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే కొత్త ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేసేందుకు గాను, కంపెనీ దీని ధరను రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలోనే ఉంచవచ్చని సమాచారం.

సెప్టెంబర్ 2న జరిగే అధికారిక లాంచ్ వేడుకలో ఈ సింపుల్​ ఎనర్జీకి చెందిన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు పేరు, పూర్తి స్పెసిఫికేషన్లు, బుకింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe