భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ శుక్రవారం (మార్చి 27) ఒక ‘బ్లాక్ ఫ్రైడే’గా మిగిలిపోయింది. గత రెండు రోజులుగా స్వల్పంగా కోలుకున్న మార్కెట్లు, వారాంతపు ట్రేడింగ్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్లను వణికించాయి. కేవలం ఒక్క రోజులోనే మదుపర్ల ఆస్తి దాదాపు రూ. 9 లక్షల కోట్లు గాలిలో కలిసిపోయింది.
పాతాళానికి సూచీలు

శుక్రవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,690 పాయింట్లు (2.25%) పతనమై 73,583 వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 487 పాయింట్లు (2.09%) నష్టపోయి 22,820 వద్ద స్థిరపడింది. గతేడాది డిసెంబర్ 1న సెన్సెక్స్ తాకిన గరిష్ట స్థాయి (86,159) తో పోలిస్తే, ప్రస్తుతం మార్కెట్ 15 శాతం మేర పడిపోవడం గమనార్హం.
906 షేర్లు పాతాళానికి..
మార్కెట్ పతనం ఎంత తీవ్రంగా ఉందంటే.. ఏకంగా 906 షేర్లు తమ 52 వారాల కనిష్ట స్థాయికి (52-week low) పడిపోయాయి. వీటిలో హెచ్ఏఎల్ (HAL), టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, స్విగ్గీ (Swiggy), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, లోధా డెవలపర్స్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు ఉన్నాయి. వీటితో పాటు ఏసీసీ (ACC), బ్లూడార్ట్, ఇంద్రప్రస్థ గ్యాస్ వంటి స్టాక్స్ కూడా భారీగా నష్టపోయాయి.
పతనానికి ప్రధాన కారణాలేంటి?
మార్కెట్ ఇలా కుప్పకూలడానికి పలు కారణాలను విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు.
“అంతర్జాతీయంగా బాండ్ యీల్డ్స్ పెరగడం, పశ్చిమ దేశాల మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల వార్తలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. దీనికి తోడు రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) వరుసగా వాటాలను విక్రయించడం మార్కెట్ను దెబ్బతీశాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా వారాంతానికి ముందే ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకునేలా (Profit Booking) చేశాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు.
మున్ముందు ఎలా ఉండబోతోంది?
రానున్న రోజుల్లో మార్కెట్ అస్థిరంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా ప్రకారం.. నిఫ్టీకి 22,500 వద్ద తక్షణ మద్దతు (Support) ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ స్థాయిని కూడా కోల్పోతే, అది 22,000 వరకు పడిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ కోలుకోవాలంటే నిఫ్టీ 23,000 మార్కును దాటాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా పెట్టుబడులు పెట్టకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}రానున్న రోజుల్లో మార్కెట్ అస్థిరంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా ప్రకారం.. నిఫ్టీకి 22,500 వద్ద తక్షణ మద్దతు (Support) ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ స్థాయిని కూడా కోల్పోతే, అది 22,000 వరకు పడిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ కోలుకోవాలంటే నిఫ్టీ 23,000 మార్కును దాటాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా పెట్టుబడులు పెట్టకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}1. 52 వారాల కనిష్ట స్థాయి (52-week low) అంటే ఏమిటి?
గత ఏడాది కాలంలో (52 వారాలు) ఒక షేరు ధర పడిపోయిన అత్యంత తక్కువ ధరనే '52 వారాల కనిష్ట స్థాయి' అంటారు. ఇది ఆ షేరుపై ఇన్వెస్టర్ల నమ్మకం తగ్గడాన్ని లేదా మార్కెట్ ప్రతికూలతను సూచిస్తుంది.
2. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత తగ్గింది?
గురువారం రూ. 431 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ, శుక్రవారం నాటికి రూ. 422 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
3. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి వ్యవహరించాలని, మంచి కంపెనీల షేర్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించగలరు.)