గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు పెరిగి 78,955 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,636 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 58,064 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 17.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,013.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,400- 24,450 లెవల్స్ కీలక సపోర్ట్గా, 24,750- 24,800 లెవల్స్ కీలక రెసిస్టెన్స్గానూ ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సూచీ మరింత పెరగొచ్చు. సపోర్ట్ బ్రేక్ అయితే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించవచ్చు,” అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.9 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.2శాతం పెరిగి బ్యారెల్కి 83.48 డాలర్ల వద్దకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కళ్యాన్ జ్యువెలర్స్ ఇండియా - బై రూ. 598, స్టాప్ లాస్ రూ. 577, టార్గెట్ రూ. 640
భారత్ డైనమిక్స్- బై రూ. 1299, స్టాప్ లాస్ రూ. 1255, టార్గెట్ రూ . 1390
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - బై రూ. 182.5, స్టాప్ లాస్ రూ. 176, టార్గెట్ రూ. 196
గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్- బై రూ. 2599, స్టాప్ లాస్ రూ. 2510, టార్గెట్ రూ. 2770
బయోకాన్- బై రూ. 437, స్టాప్ లాస్ రూ. 421, టార్గెట్ రూ. 468