...
...
Next Story

మళ్లీ ఉద్రిక్తతలు: గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు.. నేడు కొనాల్సిన 8 షేర్లు ఇవే

పశ్చిమాసియాలో ముదిరిన యూఎస్-ఇరాన్ ఘర్షణలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు ఇస్తుండగా, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మార్కెట్ నిపుణులు 8 షేర్లను సిఫార్సు చేశారు.

Published on: Sep 1, 2026, 08:12:00 IST
Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, యూఎస్-ఇరాన్ యుద్ధ భయాల మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ట్రేడయ్యే గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) ఉదయం 6:35 గంటల సమయంలో గత ముగింపుతో పోలిస్తే దాదాపు 44 పాయింట్ల నష్టంతో 24,207 వద్ద కదులుతూ ప్రతికూల ప్రారంభాన్ని సూచిస్తోంది.

సెన్సెక్స్ సూచీలో నిన్న నష్టపోయిన స్టాక్స్ (PTI)
సెన్సెక్స్ సూచీలో నిన్న నష్టపోయిన స్టాక్స్ (PTI)

గత సెషన్‌లోనూ స్వదేశీ బెంచ్‌మార్క్ సూచీలు క్షీణతను నమోదు చేశాయి. నిఫ్టీ 50 సూచీ 0.39 శాతం నష్టపోయి 24,080 వద్ద ముగియగా, 30 షేర్ల సెన్సెక్స్ 0.40 శాతం తగ్గి 76,957 వద్ద స్థిరపడింది.

గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి – పశ్చిమాసియా సంక్షోభం

గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 25.62 పాయింట్లు తగ్గగా, నాస్‌డాక్ కాంపోజిట్ 31.53 పాయింట్లు క్షీణించింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దళాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర దాదాపు 1 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్లు దాటి ట్రేడవుతోంది. చమురు ధరల పెరుగుదల యూఎస్ బాండ్ ఈల్డ్స్‌ను పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

ఇరాన్ నాశనమైపోయింది: ట్రంప్ వ్యాఖ్యలు

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లోని ఒక దీవిపై అమెరికా దళాలు దాడులు చేయగా, ఇరాన్ దళాలు యూఏఈ, జోర్డాన్‌లలోని స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాలపై స్పందించిన యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పూర్తిగా విఫలమైన దేశమని ఆరోపించారు. ఇరాన్‌కు నావికాదళం, వాయుసేన సామర్థ్యాలు లేవని, ఆ దేశ కరెన్సీ పూర్తిగా కూలిపోయిందని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.

జీడీపీ బలం.. నిఫ్టీ సాంకేతిక విశ్లేషణ

సాంకేతిక కోణంలో చూస్తే నిఫ్టీ 24,100 పాయింట్ల దిగువకు చేరినప్పటికీ, 24,000 పాయింట్ల కీలక మద్దతును నిలబెట్టుకుంది. కొటక్ సెక్యూరిటీస్ నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ ప్రకారం, నిఫ్టీ 24,000 పైన నిలిస్తే 24,200 - 24,300 స్థాయిల వరకు వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ 24,000 దిగువకు జారితే అమ్మకాల ఒత్తిడి పెరిగి 23,850 - 23,800 స్థాయిలకు పడిపోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ.. జులై 29న ఏర్పడిన గ్యాప్, ఇటీవలి స్వింగ్ లో ఆధారంగా 24,000 స్థాయి నిఫ్టీకి బలమైన ఆధారంగా నిలుస్తోందన్నారు. ఈ మద్దతు నిలిచినంత వరకు మార్కెట్ మళ్లీ పైకి లేచే అవకాశం ఉందని వివరించారు.

నేడు కొనాల్సిన 8 షేర్లు (Stocks to Buy)

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు ఎనిమిది షేర్లను సిఫార్సు చేశారు:

సుమీత్ బగాడియా (ఛాయిస్ బ్రోకింగ్):

  1. లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ (Lenskart Solutions): కొనుగోలు ధర: 662 | టార్గెట్: 716 | స్టాప్ లాస్: 635
  2. పిరమల్ ఫైనాన్స్ (Piramal Finance): కొనుగోలు ధర: 2,300 | టార్గెట్: 2,484 | స్టాప్ లాస్: 2,208

గణేష్ డోంగ్రే (ఆనంద్ రాఠీ):

  1. బ్లూ స్టార్ (Blue Star): కొనుగోలు ధర: 1,470 | టార్గెట్: 1,530 | స్టాప్ లాస్: 1,440
  2. టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company): కొనుగోలు ధర: 4,320 | టార్గెట్: 4,430 | స్టాప్ లాస్: 4,250
  3. సిప్లా (Cipla): కొనుగోలు ధర: 1,415 | టార్గెట్: 1,465 | స్టాప్ లాస్: 1,390

షిజు కూతుపాలక్కల్ (ప్రభుదాస్ లీలాధర్):

  1. ఫుజియామా పవర్ సిస్టమ్స్ (Fujiyama Power Systems): టార్గెట్: 488 | స్టాప్ లాస్: 448
  2. గ్రీవ్స్ కాటన్ (Greaves Cotton): టార్గెట్: 215 | స్టాప్ లాస్: 192
  3. కామ్స్ (CAMS): టార్గెట్: 825 | స్టాప్ లాస్: 764

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe