Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రోజు మీ ఫోకస్ ఏ షేర్లపై ఉండాలో తెలుసా?

ఫిబ్రవరి 10, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 10, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 485 పాయింట్లు పెరిగి 84,066 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 174 పాయింట్లు వృద్ధిచెంది 25,867 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 549 పాయింట్లు పెరిగి 60,669 వద్దకు చేరింది.

ఫిబ్రవరి 10- స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
ఫిబ్రవరి 10- స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,254.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,900.17 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,896.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ 25,800 ఎగువన ముగిసి డోజీ క్యాండిల్​ని ఫార్మ్​ చేసింది. అది అనిశ్చితికి సంకేతం. 25,795 వద్ద సూచీకి సపోర్ట్​ ఉంది. ఇక్కడి నుంచి పెరిగితే సూచీ 26,000 వరకు వెళ్లొచచు. అది దాడితే 26,200 వరకు కూడా వెళ్లొచ్చు,” అని సెంట్రమ్​ బ్రోకింగ్​కి చెందిన నీలేశ్​ జైన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.04 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.47శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.95 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. స్పాట్​ గోల్డ్​ 1శాతం పడి ఔన్సుకు 5,016.56 డాలర్లకు చేరింది. స్పాట్​ సిల్వర్​ 2.5శాతం పడి ఔన్సుకు 81.31 డాలర్లకు వెళ్లింది.

స్టాక్స్​ టు బై..

కరూర్​ వైశ్యా బ్యాంక్​- బై రూ. 327, స్టాప్​ లాస్​ రూ. 315, టార్గెట్​ రూ. 351

రామ్​కో సిమెంట్​- బై రూ. 1205, స్టాప్​ లాస్​ రూ. 1162, టార్గెట్​ రూ. 1291

నౌక్రీ- బై రూ. 1178, స్టాప్​ లాస్​ రూ. 1150, టార్గెట్​ రూ. 1230

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​- బై రూ. 708, స్టాప్​ లాస్​ రూ. 690, టార్గెట్​ రూ. 745

వేదాంత- బై రూ. 680, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 720

ఎల్​ అండ్​ టీ- బై రూ. 4113, స్టాప్​ లాస్​ రూ. 4040, టార్గెట్​ రూ. 4250

బెల్​రైస్​- బై రూ. 185, స్టాప్​ లాస్​ రూ. 181, టార్గెట్​ రూ. 197

పీటీసీ ఇండియా- బై రూ. 187.35, స్టాప్​ లాస్​ రూ. 183.50, టార్గెట్​ రూ. 200

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More