...
...
Next Story

Stock market crash : బాబోయ్​ మళ్లీ రక్తపాతమే! ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు..

Stock market updates : ఇరాన్​ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో మరోసారి రక్తపాతం కనిపిస్తోంది. భారత్​ స్టాక్​ మార్కెట్​లు కూడా భారీ నష్టాలతో ప్రారంభం అవుతాయని గిఫ్ట్​ నిఫ్టీ సూచిస్తోంది.

Published on: Mar 23, 2026, 08:15:45 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 326 పాయింట్లు పెరిగి 74,533 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 112 పాయింట్లు వృద్ధిచెంది 23,115 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 24 పాయింట్లు పడి 53,427 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

ఇరాన్​- అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధం కారణంగా స్టాక్​ మార్కెట్​లో గత 20 రోజులుగా అనిశ్చితి కొనసాగుతోంది. సోమవారం కూడా ప్రపంచ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,518.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,706.23 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 335 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 వీక్లీ చార్ట్​లో డోజీ క్యాండిల్​ని ఫార్మ్​ అయ్యింది. ఇది బుల్లిష్​ రివర్సల్​కి సంకేతం. ఆర్​ఎస్​ఐ కూడా ట్రెండ్​ రివర్సల్​ని సూచిస్తోంది. కానీ 22,930 వద్ద ఉన్న సపోర్ట్​ని హోల్డ్​ చేస్తేనే నిఫ్టీ50లో రివర్సల్​ కన్ఫర్మ్​ అవుతుంది. 23,378- 23,868 దగ్గర కీలక రెసిస్టెన్స్​ కనిపిస్తోంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ వినయ్​ రజానీ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.96 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.51శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.01 శాతం డౌన్​ అయ్యింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్​ ధర 0.68శాతం పడి బ్యారెల్​కి 111.43 డాలర్లకు చేరింది. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

స్టాక్స్​ టు బై టుడే..

జీపీఐఎల్​- బై రూ. 262, స్టాప్​ లాస్​ రూ. 252, టార్గెట్​ రూ. 277

ఎన్​టీపీసీ- బై రూ. 381, స్టాప్​ లాస్​ రూ. 365, టార్గెట్​ రూ. 410

జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​- బై రూ. 238, స్టాప్​ లాస్​ రూ. 225, టార్గెట్​ రూ. 260

ఎటర్నల్​- బై రూ. 232, స్టాప్​ లాస్​ రూ. 220, టార్గెట్​ రూ. 265

ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1245, స్టాప్​ లాస్​ రూ. 1225, టార్గెట్​ రూ. 1275

ఐషేర్​ మోటార్స్​- బై రూ. 6909, స్టాప్​ లాస్​ రూ. 6800, టార్గెట్​ రూ. 7220

డెల్హివరీ- బై రూ. 422.85, స్టాప్​ లాస్​ రూ. 410, టార్గెట్​ రూ. 450

ఎన్​టీపీసీ గ్రీన్​- బై రూ. 101, స్టాప్​ లాస్​ రూ. 98, టార్గెట్​ రూ. 108

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe