Gift Nifty live : గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు పడి 75,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 23,655 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్లు పడి 53,439 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,891.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్లో భారీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. 23,800 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్ని దాటకపోయింది. సూచీ 23,300- 23,800 లెవల్స్ మధ్య రేంజ్ బౌండ్లో కొనసాగుతోంది. 23,850- 23,900 లెవల్స్ దాటితే నిఫ్టీ50లో అప్ట్రెండ్ కనిపించవచ్చు. 23,500 వద్ద సపోర్ట్ దక్కొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.55 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.09 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 2.3శాతం పెరిగి బ్యారెల్కి 104.96 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
డా. అగర్వాల్స్ హెల్త్ కేర్- బై రూ. 481, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2161, స్టాప్ లాస్ రూ. 2065, టార్గెట్ రూ. 2300
జమ్ము కశ్మీర్ బ్యాంక్- బై రూ. 140, స్టాప్ లాస్ రూ. 130, టార్గెట్ రూ. 150
లింకన్ ఫార్మా- బై రూ. 732, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 785
ఆర్తీ ఇండస్ట్రీస్- బై రూ. 482, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520