ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. కానీ వరుణుడు మాత్రం బిగ్ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ లో భాగంగా కొలంబోలో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాక్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. పొద్దున నుంచి మబ్బులు పట్టి ఉన్న కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ వర్షం ముప్పు మాత్రం తొలగిపోలేదు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్ లో చాలా నాటకీయ పరిణామాల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. మొదట ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ తర్వాత తోక ముడిచింది. అయితే ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఇప్పుడు కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం 8 శాతం ఉందని ఆక్యూవెదర్ తెలిపింది. అలాగే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వర్షం వల్ల అంతరాయం కలగొచ్చని సమాచారం.
లైవ్ స్ట్రీమింగ్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-ఎ లోని ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. ఈ హై వోల్టేజీ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో చూడొచ్చు. ఓటీటీలో అయితే జియోహాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు.
నో షేక్ హ్యాండ్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటే చాలు ఇండియా మండిపోతుంది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను మనం చావుదెబ్బ కొట్టాం. ఆ తర్వాత పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ల్లో మన ప్లేయర్లు వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లోనూ అదే కొనసాగే అవకాశముంది. పాకిస్థాన్ ప్లేయర్లకు ఇండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వరని సమాచారం. టాస్ సమయంలోనూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయడని తెలిసింది.
రోహిత్ ఎంట్రీ
{{/usCountry}}పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటే చాలు ఇండియా మండిపోతుంది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను మనం చావుదెబ్బ కొట్టాం. ఆ తర్వాత పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ల్లో మన ప్లేయర్లు వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లోనూ అదే కొనసాగే అవకాశముంది. పాకిస్థాన్ ప్లేయర్లకు ఇండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వరని సమాచారం. టాస్ సమయంలోనూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయడని తెలిసింది.
రోహిత్ ఎంట్రీ
{{/usCountry}}ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరును స్టేడియంలో చూసేందుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు ఎగబడతారు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు కొలంబో చేరుకున్నాడు. ఇతర దిగ్గజ ఆటగాళ్లు, సెలబ్రిటీలు కూడా ఈ పోరుకు చూసేందుకు తరలివస్తున్నారు.