టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు మరికొన్ని గంటలే ఉంది. ఈ రోజు (మార్చి 8) రాత్రి 7 గంటలకు ఈ టైటిల్ పోరు స్టార్ట్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మెగా ఫైట్ జరుగుతోంది. ఈ ఫైనల్ నేపథ్యంలో ఇండియా ఫైనల్ ఎలెవన్ పై దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు.
అభిషేక్ పై వేటు

న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ను పక్కన పెట్టాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ లో అభిషేక్ శర్మ ను జట్టు నుంచి తొలగించాలని గవాస్కర్ గట్టిగా సూచించాడు. గత తప్పిదాల నుంచి అతను ఇంకా నేర్చుకోలేదని, ఒకే విధంగా ఔట్ అవుతూనే ఉన్నాడని గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
మూడు సార్లు డకౌట్
ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో 25 ఏళ్ల అభిషేక్ శర్మ 12.71 సగటుతో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. సూపర్ 8 లో జింబాబ్వేపై అర్ధ శతకం సాధించకపోతే అతని గణాంకాలు మరింత దారుణంగా ఉండేవి. ఈ టోర్నీలో అతను మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో స్పిన్నర్లకు నాలుగు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో కేవలం 9 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు.
బ్యాటింగ్ లో మార్పు లేదు
‘‘ఇది చాలా కఠినమైన కాల్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్. కానీ అతను తన తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు. ఒకే విధంగా ఔట్ అవుతున్నాడు. స్పిన్నర్లు అతణ్ని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అభిషేక్ ను ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించాలి’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఇషాన్ కిషన్ ఓపెనర్
{{/usCountry}}‘‘ఇది చాలా కఠినమైన కాల్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్. కానీ అతను తన తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు. ఒకే విధంగా ఔట్ అవుతున్నాడు. స్పిన్నర్లు అతణ్ని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అభిషేక్ ను ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించాలి’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఇషాన్ కిషన్ ఓపెనర్
{{/usCountry}}‘‘సంజు శాంసన్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయాలి. రింకు సింగ్ తిరిగి జట్టులోకి రావాలి. రింకుకు ఛాన్స్ ఇవ్వాలి."అని గవాస్కర్ తెలిపాడు. మరోవైపు రన్స్ భారీగా ఇచ్చేస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఫైనల్ మ్యాచ్ కు టీమ్ నుంచి తప్పించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. వరుణ్ ప్లేస్ లో కుల్ దీప్ ను ఆడించాలని సన్నీ పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.