తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం సిద్ధమవుతున్న టీవీకే పార్టీ… తాజాగా 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ వివరాలను ఆ పార్టీ అధినేత విజయ్ వెల్లడించారు.
2 చోట్ల నుంచి విజయ్ పోటీ…

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.చెన్నైలో ఆదివారం జరిగిన సభలో విజయ్… ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తమకు, డీంకే మధ్యే అసలైన పోటీ ఉందని వ్యాఖ్యానించారు.
పెరంబూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్ పై విజయ్ పోటీ చేయనున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ పై బరిలో ఉంటారు.
ఒక్క అవకాశం ఇవ్వండి - విజయ్
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ…. విశ్వాసంతో, నిజాయితీగా, ప్రజాసేవకు అంకితభావంతో ఉంటామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహిళల భద్రతతో పాటు మాదకద్రవ్య రహిత తమిళనాడుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
“ మా 'విజిల్' చిహ్నానికి ఓటు వేయాలని నేను ప్రజలను కోరుతున్నాను. మేము ఇక్కడ ప్రజల కోసం మాత్రమే ఉన్నాము. ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉంటాం. గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోం. అవినీతికి పాల్పడబోమని హామీ ఇస్తున్నాను. మహిళల భద్రతకు భరోసా ఇస్తాం, మాదకద్రవ్య రహిత తమిళనాడును సృష్టిస్తాం. కఠినమైన శాంతిభద్రతలను పాటిస్తాం. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోము. ఇదే నా వాగ్దానం. తమిళనాడు సంక్షేమం కోసం టీవీకేకు ఒక్క అవకాశం ఇవ్వండి” అని విజయ్ కోరారు.
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మరోవైపు ఉండగా.. టీవీకే ఒంటిరిగానే బరిలో నిలవనుంది.
{{/usCountry}}తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మరోవైపు ఉండగా.. టీవీకే ఒంటిరిగానే బరిలో నిలవనుంది.
{{/usCountry}}