చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు అధికార తమిళగ వెట్రి కజగం (TVK) ఎమ్మెల్యేకు ఏకంగా రూ.35 కోట్లు లంచం ఆఫర్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల అనంతరం అధికార టీవీకే, ప్రతిపక్ష ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం మొదలైంది. రెండు పార్టీలూ పరస్పరం ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
రూ. 35 కోట్ల ఆఫర్.. అసలేం జరిగింది?

టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జూన్ 29న ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (IPDS) అనే కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నానంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించాడని ఇళయరాజా పేర్కొన్నారు. ఒక పెద్ద రాజకీయ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్లు చెప్పిన తిరునావుక్కరసు, అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్పై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కోరినట్లు వెల్లడించారు. ఇందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్లు ఇస్తామంటూ ఎర వేసినట్లు ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు ఆధారంగా డీ1 ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తిరునావుక్కరసుతో పాటు తిరుచిరాపల్లికి చెందిన నరేష్, చెన్నైకి చెందిన త్యాగరాజన్లను అరెస్ట్ చేశారు.
పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడైన నరేష్ కొద్దిరోజుల క్రితం చెన్నైలో వి. అశోక్ కుమార్ను కలిశాడు. ఈ అశోక్ కుమార్.. మాజీ మంత్రి, ప్రస్తుత కోయంబత్తూర్ సౌత్ డీఎంకే ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ సోదరుడు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ల ఆదేశాల మేరకే తిరునావుక్కరసు సదరు ఎమ్మెల్యేను సంప్రదించి, డబ్బు ఆఫర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఐపీడీఎస్ (IPDS) సంస్థను సెంథిల్ బాలాజీయే నడుపుతున్నారని టీవీకే ఆరోపిస్తోంది.
"మా ఎమ్మెల్యేలను లొంగతీసుకునే కుట్ర"
నిందితుల అరెస్ట్ తర్వాత రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పి. నిర్మల్ కుమార్ డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "గడిచిన 40 రోజులుగా డీఎంకే, స్టాలిన్ బృందం మా ఎమ్మెల్యేలను లొంగతీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయని మేం నిరంతరం చెప్తూనే ఉన్నాం" అని మంత్రి ఆరోపించారు. డీఎంకే నేతలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ వెనుక ఉండి ఈ కుట్ర నడిపించారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని వివరించారు.
తిప్పికొట్టిన డీఎంకే.. గవర్నర్కు విజ్ఞప్తి
{{/usCountry}}నిందితుల అరెస్ట్ తర్వాత రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పి. నిర్మల్ కుమార్ డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "గడిచిన 40 రోజులుగా డీఎంకే, స్టాలిన్ బృందం మా ఎమ్మెల్యేలను లొంగతీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయని మేం నిరంతరం చెప్తూనే ఉన్నాం" అని మంత్రి ఆరోపించారు. డీఎంకే నేతలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ వెనుక ఉండి ఈ కుట్ర నడిపించారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని వివరించారు.
తిప్పికొట్టిన డీఎంకే.. గవర్నర్కు విజ్ఞప్తి
{{/usCountry}}టీవీకే ఆరోపణలను డీఎంకే గట్టిగా తిప్పికొట్టింది. రివర్స్ అటాక్ చేస్తూ టీవీకే పార్టీయే ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతోందని ఆరోపించింది.
"ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఎండీఎంకే (MDMK) అధినేత వైకో స్వయంగా అంగీకరించారు" అని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు. కడయనల్లూర్ ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్, శీర్కాళి ఎమ్మెల్యే ఎస్. సెంథిల్ సెల్వన్ అనే ఇద్దరు ఎండీఎంకే శాసనసభ్యులు డీఎంకే గుర్తుపైనే గెలిచారని ఆయన గుర్తుచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) విభాగంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ను భారతి కోరారు.
డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి నుంచి ఎండీఎంకే బయటకు వచ్చి, అధికార టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన మూడు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే చేస్తున్న ఆరోపణలను మంత్రి నిర్మల్ కుమార్ తోసిపుచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే డీఎంకే ఇలాంటి అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.