బంగ్లాదేశ్ రాజకీయాల్లో గురువారం ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, BNP అగ్రనేత తారిఖ్ రెహమాన్ ఏకంగా 17 ఏళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టారు. మాతృదేశంపై మమకారంతో విమానాశ్రయం వెలుపల తన పాదరక్షలు విడిచి, మట్టిని చేతుల్లోకి తీసుకుని ఆయన ఉద్వేగానికి లోనైన తీరు అక్కడి జనాలను కదిలించింది.
వచ్చే 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢాకా చేరుకున్న వెంటనే పూర్బాచల్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయన చేసిన ఐక్యతా పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.
అందరి బంగ్లాదేశ్.. సురక్షిత బంగ్లాదేశ్
"మన దేశం కోసం నా దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్న సురక్షితమైన రాజ్యాన్ని నిర్మించడమే నా లక్ష్యం" అని 60 ఏళ్ల రెహమాన్ పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..
"ఈ దేశాన్ని కలిసి నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశం ముస్లింలది, హిందువులది, బౌద్ధులది, క్రైస్తవులది. మైదాన ప్రాంతాల ప్రజలతో పాటు కొండ ప్రాంతాల్లో నివసించే వారిది కూడా. ప్రతి పురుషుడు, స్త్రీ, చిన్నపిల్లలు ధైర్యంగా ఇల్లు విడిచి వెళ్లి, మళ్ళీ సురక్షితంగా తిరిగి రాగలిగే బంగ్లాదేశ్ను మనం నిర్మించుకుందాం" అని పిలుపునిచ్చారు.
దేశంలో శాంతి స్థాపనే తన మొదటి ప్రాధాన్యత అని, రాజకీయ పక్షాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్లో వెల్లువెత్తిన ఆగ్రహం.. రెహమాన్ స్పందన
ఇటీవల బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని మూకదాడి (Lynching) చేసి చంపడంపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ విచారం వ్యక్తం చేసినప్పటికీ, మైనారిటీల రక్షణపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహమాన్ "అందరూ సమానమే" అంటూ చేసిన వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల్లో భరోసా నింపే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
{{/usCountry}}ఇటీవల బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని మూకదాడి (Lynching) చేసి చంపడంపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ విచారం వ్యక్తం చేసినప్పటికీ, మైనారిటీల రక్షణపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహమాన్ "అందరూ సమానమే" అంటూ చేసిన వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల్లో భరోసా నింపే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
{{/usCountry}}మరోవైపు విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ మృతితో దేశంలో నెలకొన్న ఉద్రిక్తతలపై కూడా ఆయన స్పందించారు. శాంతిని కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
తల్లి కోసం ఉద్వేగపూరిత పలకరింపు
విమానాశ్రయం నుంచి నేరుగా తన అనుచరులతో భారీ కాన్వాయ్లో వెళ్ళిన రెహమాన్, ఎవర్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తల్లి ఖలీదా జియాను పరామర్శించారు. 17 ఏళ్ల తర్వాత కొడుకును చూసిన ఆ తల్లి కళ్లలో ఆనందం, అటు మాతృభూమి కోసం తపిస్తున్న నాయకుడి ఉద్వేగం వెరసి బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.