...
...
Next Story

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు.. షేర్ల జోరు

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలాన్ని బోర్డు మరో ఐదేళ్ల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో పాటు టాటా సన్స్ లిస్టింగ్ వార్తలతో గురువారం నాటి ట్రేడింగ్‌లో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి.

Published on: Sep 17, 2026, 15:25:58 IST
Advertisement

భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ 'టాటా సన్స్' ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలాన్ని ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలో తాను పదవిలో కొనసాగనని ప్రకటించిన చంద్రశేఖరన్, బోర్డు నిర్ణయంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 2027 ఫిబ్రవరితో ఆయన ప్రస్తుత పదవీకాలం ముగియనుండగా, కొత్త ఆమోదంతో ఆయన నాయకత్వం మరింత కాలం కొనసాగనుంది.

కీలక వివాదాలు.. బోర్డు ఆమోదం

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు.. షేర్ల జోరు
టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు.. షేర్ల జోరు

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో గ్రూప్ కంపెనీల మూలధన కేటాయింపులు, ఐపీఓ లిస్టింగ్ అంశాలపై చంద్రశేఖరన్‌కు కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంతోనే ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టకూడదని భావించారు. అయితే గ్రూప్ ప్రయోజనాల దృష్ట్యా డైరెక్టర్ల బోర్డు ఈ పొడిగింపునకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేసేందుకు నోయెల్ టాటా సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడటం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

స్పష్టమైన నాయకత్వమే లక్ష్యం

సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు గతంలోనే ఆయన పదవీకాలాన్ని ఐదేళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయి. నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్‌సీ) కూడా దీనికి మద్దతు తెలిపింది. కానీ ఫిబ్రవరి 24, 2026న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడి వ్యతిరేకత వల్ల ఏకాభిప్రాయం కుదరలేదు.

"కీలక ప్రాజెక్టులు అమలవుతున్న ఈ సమయంలో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వంపై స్పష్టత ఉండటం ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు, భాగస్వాములకు ఎంతో ముఖ్యం" అని చంద్రశేఖరన్ గతంలో స్పష్టం చేశారు. ఆరు నెలల అనిశ్చితి తర్వాత ఎట్టకేలకు బోర్డు ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది.

మార్కెట్లో టాటా షేర్ల సునామీ

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks