ప్రముఖ భారతీయ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, కంపెనీ తన లాభదాయకతను పెంచుకుంటూ ఇన్వెస్టర్లలో భరోసా నింపింది. ఈ త్రైమాసికంలో నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి చెంది రూ. 1,122 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ. 983.2 కోట్లుగా ఉంది.
ఆదాయం, మార్జిన్ల వృద్ధి
కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue) 8 శాతం పెరిగి రూ. 14,393 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.8 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక నిర్వహణ పనితీరు (EBIT) విషయానికి వస్తే, ఏకంగా 40.1 శాతం పెరుగుదలతో రూ. 1,892 కోట్లకు చేరింది. దీనివల్ల ఎబిట్ మార్జిన్ 13.1 శాతానికి మెరుగుపడటం విశేషం.
కొత్త ఒప్పందాల వెల్లువ
టెక్ మహీంద్రా ఈసారి భారీ డీల్స్ను సొంతం చేసుకుంది. "ఈ క్వార్టర్లో మేము సుమారు 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,150 కోట్లు) విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇది 47 శాతం వృద్ధి. మార్కెట్లో మా సేవల పట్ల పెరుగుతున్న డిమాండ్కు ఇది నిదర్శనం" అని కంపెనీ నివేదికలో పేర్కొంది. డాలర్ ఆదాయం కూడా 1.5 శాతం పెరిగి 1,610 మిలియన్ డాలర్లకు చేరింది.
మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత?
ప్రస్తుతం టెక్ మహీంద్రాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,49,616గా ఉంది. అయితే, గతేడాదితో పోలిస్తే 872 మంది ఉద్యోగులు తగ్గడం గమనార్హం. ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగులు సంస్థను వీడటం) 12.3 శాతంగా నమోదైంది.
సీఎఫ్ఓ ఏమన్నారంటే..
"వరుసగా తొమ్మిదవ త్రైమాసికంలోనూ మేము మార్జిన్లను మెరుగుపరుచుకున్నాం. ఇది మా ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టడం వల్ల నగదు ప్రవాహం (Cash flow) మెరుగుపడింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి మేము నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా విజయవంతంగా సాగుతున్నాం" అని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రోహిత్ ఆనంద్ వివరించారు.
స్టాక్ మార్కెట్లో పరుగులు
{{/usCountry}}"వరుసగా తొమ్మిదవ త్రైమాసికంలోనూ మేము మార్జిన్లను మెరుగుపరుచుకున్నాం. ఇది మా ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టడం వల్ల నగదు ప్రవాహం (Cash flow) మెరుగుపడింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి మేము నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా విజయవంతంగా సాగుతున్నాం" అని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రోహిత్ ఆనంద్ వివరించారు.
స్టాక్ మార్కెట్లో పరుగులు
{{/usCountry}}మెరుగైన ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో టెక్ మహీంద్రా షేరు రాణించింది. బీఎస్ఈ (BSE)లో షేరు ధర 5.17 శాతం పెరిగి రూ. 1,670.55 వద్ద స్థిరపడింది. ఒక్క రోజే షేరు విలువ రూ. 82 పెరగడంతో ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)