Realme smartphones : రియల్మీ నుంచి అతి త్వరలోనే రెండు కొత్త స్మార్ట్ఫోన్స్- అదిరిపోతాయంతే..!
Realme 16T 5G : భారత మార్కెట్లోకి రియల్మీ 16టీ 5జీ, రియల్మీ పీ4ఆర్ 5జీ స్మార్ట్ఫోన్లు త్వరలోనే విడుదల కానున్నాయి. మూడు కలర్ వేరియంట్లు, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇవి లభించనున్నట్లు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం ‘రియల్మీ’.. భారతీయ మొబైల్ మార్కెట్ కోసం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన రియల్మీ 16, పీ4-సిరీస్ లైనప్లను మరింత విస్తరిస్తూ, రెండు కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్లు ‘రియల్మీ 16టీ 5జీ’, 'రియల్మీ పీ4ఆర్ 5జీ' పేర్లతో మార్కెట్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్స్- మోడల్ నంబర్లు, లాంచ్ అంచనాలు..
టిప్స్టర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ రెండు స్మార్ట్ఫోన్స్ వరుసగా RMX5268, RMX5266 మోడల్ నంబర్లతో డిటెక్ట్ అయ్యాయి. వీటి ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇవి అతి త్వరలోనే భారత వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ముఖ్యంగా, రియల్మీ 16టీ 5జీ ఫోన్.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రియల్మీ 16 ప్రో 5జీ, 16 ప్రో+ 5జీ సిరీస్లో మూడవ ఫోన్గా చేరనుంది.
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్స్- వేరియంట్లు, స్టోరేజ్ ఆప్షన్లు..
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రియల్మీ ఈ ఫోన్లను మూడు వేర్వేరు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో తీసుకురానుంది:
రియల్మీ 16టీ 5జీ: ఇది 6 GB + 128 GB, 8 GB + 128 GB, 8 GB + 256 GB అనే మూడు వేరియంట్లలో లభించనుంది.
రియల్మీ పీ4ఆర్ 5జీ: ఇది 4 GB + 128 GB, 6 GB + 128 GB, 6 GB + 256 GB వేరియంట్లలో అమ్మకానికి రానుంది.
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్స్- రంగుల హరివిల్లు..
స్టైలిష్ డిజైన్కు పేరుగాంచిన రియల్మీ, ఈ కొత్త ఫోన్లను కూడా సరికొత్త రంగుల్లో ప్రవేశపెట్టనుంది:
రియల్మీ 16టీ 5జీ: అరోరా గ్రీన్, స్టార్లైట్ బ్లాక్, స్టార్లైట్ రెడ్ కలర్లలో లభిస్తుంది.
రియల్మీ పీ4ఆర్ 5జీ: లావెండర్ గ్లేర్, సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్ వంటి వైవిధ్యమైన షేడ్స్లో ఈ స్మార్ట్ఫోన్ రానుంది.
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్స్- మునుపటి లాంచ్ల ప్రభావం..
భారత్లో ఈ ఏడాది జనవరి 6న రియల్మీ 16 ప్రో సిరీస్ ఘనంగా విడుదలైంది. అందులో రియల్మీ 16 ప్రో+ 5జీ ప్రారంభ ధర రూ. 39,999 గా ఉండగా, రియల్మీ 16 ప్రో 5జీ ధర రూ. 31,999 గా నిర్ణయించారు. ఈ ప్రో+ మోడల్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, భారత్కు మాత్రమే ప్రత్యేకమైన 'కామెల్లియా పింక్' రంగుల్లో లభిస్తోంది. ఇక ప్రో మోడల్ మాస్టర్ గోల్డ్, పెబుల్ గ్రే, ఇండియా-ఎక్స్క్లూజివ్ 'ఆర్చిడ్ పర్పుల్' షేడ్స్లో అందుబాటులో ఉంది.
మరోవైపు, రియల్మీ పీ4-సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 20న 'రియల్మీ పీ4 లైట్' మార్కెట్లోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ (4 GB + 64 GB) ధర కేవలం రూ. 9,999 గా ఉంది.
తాజా లీకుల ప్రకారం వస్తున్న 16టీ 5జీ, పీ4ఆర్ 5జీ ఫోన్లు కూడా ఇదే స్థాయిలో భారత వినియోగదారులను ఆకట్టుకుంటాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. రియల్మీ కంపెనీని ఎప్పుడు, ఎవరు స్థాపించారు?
రియల్మీని మే 4, 2018న స్కై లీ స్థాపించారు. ఆయన అంతకుముందు ఒప్పో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వాస్తవానికి, 2010లో ఒప్పో బ్రాండ్లో ఒక ఉప-బ్రాండ్గా 'ఒప్పో రియల్' పేరుతో ఇది మొదలైనప్పటికీ, 2018లో పూర్తిస్థాయి స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది.
2. రియల్మీ కంపెనీకి, ఒప్పోకి ఉన్న సంబంధం ఏంటి?
రియల్మీ తన ప్రయాణాన్ని ఒప్పో సబ్-బ్రాండ్గా ప్రారంభించింది. ప్రారంభ దశలో రియల్మీ ఫోన్లు ఒప్పో తయారీ కేంద్రాలను, 'ColorOS' సాఫ్ట్వేర్ను పంచుకునేవి. అయితే, మే 2018లో స్కై లీ ఒప్పో నుంచి వైదొలిగి రియల్మీని ఒక స్వతంత్ర బ్రాండ్గా మార్చారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు 'BBK Electronics' అనే మాతృ సంస్థ పరిధిలోకి వస్తాయి.
3. రియల్మీ మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఏది? అది ఏ దేశంలో విడుదలైంది
రియల్మీ తన మొట్టమొదటి స్మార్ట్ఫోన్ 'Realme 1' ను మే 2018లో విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలిసారిగా భారతదేశంలోనే లాంచ్ అయింది. ఆ సమయంలో కేవలం ఆన్లైన్ మార్కెట్ ద్వారా మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












