అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక సంఘటన వెలుగుచూసింది. డల్లాస్ శివారు ప్రాంతమైన ఫ్రిస్కో (Frisco) సిటీ హాల్ ముందు యాంటీ-ఇమ్మిగ్రేషన్ (వలస వ్యతిరేక) గ్రూపులు నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శనలో, ఒక అమెరికన్ వ్యక్తి భారత జాతీయ జెండాను అత్యంత దారుణంగా అవమానించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టుకుని, భారతదేశాన్ని ఉద్దేశించి బూతులు తిడుతూ భారత త్రివర్ణ పతాకాన్ని చింపివేశాడు. నార్త్ డల్లాస్లో భారతీయ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందంటూ వారు ఈ నిరసన చేపట్టారు. ఆ వ్యక్తి జెండాను చింపుతున్న సమయంలో అక్కడున్న మిగతా నిరసనకారులు "యస్.. లెట్స్ గో" అంటూ అతడిని ప్రోత్సహిస్తూ కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఫ్రిస్కోలో ఎందుకీ వ్యతిరేకత?
డల్లాస్ పరిధిలోని ఫ్రిస్కో నగరం ఐటీ రంగానికి (Tech Industry) కేంద్రంగా మారి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి కంపెనీలలో పనిచేసేందుకు హెచ్-1బీ (H-1B) వీసాల ద్వారా పెద్ద ఎత్తున భారతీయులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రస్తుతం ఫ్రిస్కో జనాభాలో దాదాపు మూడో వంతు (One-third) ఆసియా వాసులు, ముఖ్యంగా భారతీయులే ఉన్నారు. అయితే, భారతీయుల సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఇళ్ల ధరలు, ట్రాఫిక్ పెరిగిపోతున్నాయని, సంస్కృతి మారిపోతోందని కొందరు స్థానిక అమెరికన్లు కొద్దిరోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపమే ఇప్పుడు జెండాను అవమానించే స్థాయికి చేరింది.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
ఈ వీడియో నెట్ ఇంట వైరల్ కావడంతో, ముఖ్యంగా ప్రవాస భారతీయులు, నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను గౌరవించలేని చదువురాని వాళ్లే ఇలాంటి పనులకు ఒడిగడతారని మండిపడుతున్నారు.
{{/usCountry}}ఈ వీడియో నెట్ ఇంట వైరల్ కావడంతో, ముఖ్యంగా ప్రవాస భారతీయులు, నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను గౌరవించలేని చదువురాని వాళ్లే ఇలాంటి పనులకు ఒడిగడతారని మండిపడుతున్నారు.
{{/usCountry}}ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:
"భారతీయులు ఇక్కడికి దండయాత్రకు రాలేదు, కష్టపడి పని చేయడానికి వచ్చారు. అమెరికాలో అత్యధికంగా పన్నులు చెల్లించే (Highest Taxpayers) పౌరులలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. ఇలాంటి జాత్యహంకార చేష్టలు నిజాలను మార్చలేవు" అని ఒకరు స్పందించారు.
మరికొందరు అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రను గుర్తుచేస్తూ..
"ప్రస్తుతం అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల సీఈఓలంతా భారతీయులే. అమెరికా వృద్ధికి భారతీయ ప్రతిభే ఇంధనం లాంటిది. ఇలా జెండాను చింపేసి, ఏడవడం మానేసి మీ నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి" అని హితవు పలికారు.
జాతీయ జెండాను అవమానించడం అంటే 140 కోట్ల మంది ప్రజలను, ఒక దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని, ఇలాంటి విద్వేషపూరిత చర్యలను ఎంతమాత్రం సహించబోమని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.