తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. శనివారం జరిగిన కీలక చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

విజయ్ ప్రమాణస్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారు. మే 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
శనివారం వీసీకే పార్టీ మద్దతు ప్రకటించగా, వెంటనే మరో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ (IUML) కూడా టీవీకేకు జై కొట్టింది. ఈ రెండు పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల కంటే రెండు సీట్లు అదనంగా విజయ్ ఖాతాలో చేరాయి.
టీవీకే నేత ఆధవ్ అర్జున మీడియాతో మాట్లాడుతూ.. వీసీకే తమకు మద్దతు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీసీకే శాసనసభాపక్ష నేత వన్ని అరసు ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు మద్దతు లేఖను పంపారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే అధినేత తిరుమావళవన్కు టీవీకే కృతజ్ఞతలు తెలిపింది.
ప్రస్తుతానికి వీసీకే పార్టీ ప్రభుత్వంలో చేరకుండా కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107కి తగ్గినప్పటికీ, మిత్రపక్షాల (కాంగ్రెస్ - 5, సీపీఐ - 2, సీపీఎం - 2, వీసీకే - 2, ఐయూఎంఎల్ - 2) మద్దతుతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల అండ విజయ్ కు ఉంటుంది.
{{/usCountry}}ప్రస్తుతానికి వీసీకే పార్టీ ప్రభుత్వంలో చేరకుండా కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107కి తగ్గినప్పటికీ, మిత్రపక్షాల (కాంగ్రెస్ - 5, సీపీఐ - 2, సీపీఎం - 2, వీసీకే - 2, ఐయూఎంఎల్ - 2) మద్దతుతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల అండ విజయ్ కు ఉంటుంది.
{{/usCountry}}తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. దళపతి విజయ్ తన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతుండటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.