తమిళనాడులో మద్యం విక్రయాలు చేపట్టే ప్రభుత్వ సంస్థ 'టాస్మాక్' (TASMAC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రీటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ (ఆర్డర్) ప్రక్రియను సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పాత కాగితాల పద్ధతికి స్వస్తి పలికి, డిజిటల్ విధానం ద్వారా పరిమితులకు లోబడి ఆర్డర్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.
హ్యాండ్ హెల్డ్ డివైజ్లతో స్టాక్ నమోదు

కొత్త విధానంలో భాగంగా షాపు సూపర్వైజర్లు తమ వద్ద ఉండే ప్రత్యేక హ్యాండ్ హెల్డ్ పరికరాల ద్వారానే స్టాక్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. "స్థానిక అమ్మకాలు, డిమాండ్కు అనుగుణంగా వినియోగదారులకు కావలసిన బ్రాండ్లను నిరంతరాయంగా అందించడానికే ఈ మార్పులు చేశాం" అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ కే నందకుమార్ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. 2025 నాటికి రాష్ట్రంలోని 38 జిల్లాల పరిధిలోని డిపోలలో పూర్తిస్థాయి కంప్యూటరీకరణ సాధించిన అనంతరం, మద్యం సరఫరా వ్యవస్థలో అవాంతరాలను తొలగించేందుకు ఈ తదుపరి నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక డిమాండ్కు ప్రాధాన్యం.. ఓటీపీ భద్రత
హ్యాండ్ హెల్డ్ పరికరంలో ప్రతి దుకాణానికి కేటాయించిన ప్రాథమిక స్టాక్ పరిమాణం స్వయంచాలకంగా కనిపిస్తుంది. సిస్టమ్ నిర్ణయించిన బేస్ పరిమాణాన్ని తగ్గించే వెసులుబాటు సూపర్వైజర్లకు ఉండదు. అయితే స్థానిక డిమాండ్ను బట్టి నిర్దేశిత ఆర్డర్ను 20 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. జాబితాలో లేని ఇతర రిజిస్టర్డ్ బ్రాండ్లను కూడా స్థానిక కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ఆర్డర్లో చేర్చవచ్చు.
పారదర్శకత పెంచేందుకు జిల్లా మేనేజర్ కార్యాలయాల్లో నేరుగా ఇచ్చే కాగితపు పత్రాలను రద్దు చేశారు. సూపర్వైజర్ తన నమోదిత మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) నమోదు చేస్తేనే ఆర్డర్ దాఖలవుతుంది.
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్
డిజిటల్ విధానంలో ఖరారైన ఇండెంట్ నేరుగా స్థానిక డిపోలకు చేరుతుంది. నమోదు చేసిన వివరాలకు పూర్తి బాధ్యత షాపు సూపర్వైజర్లదేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించడానికి ముందు, సాంకేతిక పనితీరును పరిశీలించేందుకు జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ప్రింటెడ్ ప్రతులతో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}డిజిటల్ విధానంలో ఖరారైన ఇండెంట్ నేరుగా స్థానిక డిపోలకు చేరుతుంది. నమోదు చేసిన వివరాలకు పూర్తి బాధ్యత షాపు సూపర్వైజర్లదేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించడానికి ముందు, సాంకేతిక పనితీరును పరిశీలించేందుకు జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ప్రింటెడ్ ప్రతులతో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}