టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: BaaS విధానంలో ₹49,999కే ఆర్బిటర్ V1
ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించింది. కొత్తగా టీవీఎస్ ఆర్బిటర్ V1 (TVS Orbiter V1) ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర, ముఖ్యంగా 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BaaS) మోడల్ ఇప్పుడు వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది.
బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఆర్బిటర్ సిరీస్లో ఇప్పటికే V2 మోడల్ ఉండగా, ఇప్పుడు తక్కువ ధరలో V1 వేరియంట్ను కంపెనీ పరిచయం చేసింది.

ధర, ఆఫర్లు (Ex-showroom Delhi)
ఈ స్కూటర్ను రెండు పద్ధతుల్లో కొనుగోలు చేయవచ్చు:
పూర్తి ధర: ₹84,500 (స్కూటర్ + బ్యాటరీ కలిపి).
BaaS మోడల్ (బ్యాటరీ లేకుండా): కేవలం ₹49,999 కే స్కూటర్ పొందవచ్చు.
BaaS అంటే ఏమిటి?
బ్యాటరీని మీరు కొనాల్సిన పనిలేదు. దానికోసం నెలకు ₹862 చందా (Subscription) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 5 ఏళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ, అస్యూరెన్స్ లభిస్తుంది. దీనివల్ల మొదట్లో పెట్టే పెట్టుబడి తగ్గుతుంది.
టీవీఎస్ ఆర్బిటర్ V1: స్పెసిఫికేషన్లు
- బ్యాటరీ ప్యాక్ -1.8 kWh (సిటీ రైడింగ్ కోసం ప్రత్యేకం)
- రేంజ్ (Range) - 86 కి.మీ (IDC సర్టిఫైడ్)
- ఛార్జింగ్ సమయం - 0–80% కేవలం 2 గంటల 20 నిమిషాల్లో
- స్టోరేజ్ (డిక్కీ) - 34 లీటర్లు (రెండు హెల్మెట్లు పడతాయి)
- సీటు పొడవు - 845 మి.మీ (ఇద్దరు సుఖంగా కూర్చోవచ్చు)
స్మార్ట్ ఫీచర్లు, టెక్నాలజీ
ఈ స్కూటర్ కేవలం చూడటానికే కాదు, ఫీచర్లలో కూడా మొనగాడే:
- కనెక్టివిటీ: మొబైల్ యాప్ ద్వారా క్రాష్ అలర్ట్స్, యాంటీ-థెఫ్ట్ (దొంగతనం) అలర్ట్స్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లు పొందవచ్చు.
- డిస్ప్లే: కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఫోన్ కాల్స్ వస్తే దీనిపైనే కనిపిస్తాయి.
- రైడింగ్ మోడ్స్: ఎకో (Eco), పవర్ (Power) అనే రెండు మోడ్స్ ఉన్నాయి.
- సేఫ్టీ: హిల్ హోల్డ్ అసిస్ట్ (కొండల మీద వెనక్కి వెళ్లకుండా ఆపుతుంది), క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
V1 vs V2: తేడా ఏంటి?
గతేడాది విడుదలైన ఆర్బిటర్ V2 లో 3.1 kWh పెద్ద బ్యాటరీ ఉంటుంది. తాజా V1 లో 1.8 kWh బ్యాటరీని ఇచ్చారు. రేంజ్ కొంచెం తక్కువైనా, సిటీలో రోజూ ఆఫీసులకు లేదా కాలేజీలకు వెళ్లే వారికి V1 సరైన ఎంపిక.
కంపెనీ మాట: "ఎలక్ట్రిక్ వాహనాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే BaaS మోడల్, ఆర్బిటర్ V1 ని ప్రవేశపెట్టాం" అని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్ గౌరవ్ గుప్తా తెలిపారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. బ్యాటరీ చందా (Subscription) కట్టకపోతే ఏమవుతుంది?
మీరు నెలకు కట్టాల్సిన ₹862 చెల్లించకపోతే, కంపెనీ బ్యాటరీ సేవలను రిమోట్ ద్వారా నిలిపివేసే అవకాశం ఉంటుంది.
2. 86 కి.మీ రేంజ్ సరిపోతుందా?
మీరు రోజువారీగా సిటీ లోపలే 30-40 కి.మీ తిరిగే వారైతే, ఈ 86 కి.మీ రేంజ్ మీకు సరిగ్గా సరిపోతుంది. రెండు రోజులకు ఒకసారి ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.
3. బాడీ డిజైన్ ఎలా ఉంటుంది?
ఇది ఫ్లాట్ సీటు, వెడల్పైన హ్యాండిల్బార్తో వస్తుంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా నడుము నొప్పి రాకుండా సౌకర్యవంతంగా ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


