పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు చివరకు భారతీయ నావికుల ప్రాణాల మీదకు తెచ్చాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయ నావికులు మరణించగా, ఒకరు అదృశ్యమైనట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) ధృవీకరించింది.

ఈ ఘటనకు సంబంధించి ముంబైలో FSUI జనరల్ సెక్రటరీ మనోజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, సదరు నౌకతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని, వివరాలను సేకరించడం కష్టంగా మారిందని తెలిపారు. "మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. నౌకకు చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి కనిపించడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. బాధిత నావికులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని డియోరియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని ఆయన వెల్లడించారు.
అమెరికాకు ముందే తెలుసు: సీమెన్స్ యూనియన్ ఆరోపణ
ఈ దాడిపై మనోజ్ యాదవ్ అమెరికా నౌకాదళంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు నౌకలో భారతీయులతో పాటు ఇతర విదేశీయులు ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన సమాచారం అమెరికా సైన్యానికి ముందే తెలుసని ఆయన వాదించారు. "నౌకలో ఉన్నవారి జాతీయత గురించి అమెరికాకు తెలియదనే మాటను నేను అస్సలు నమ్మను. ఇందులో నాకు 101 శాతం నమ్మకం ఉంది. ఒకవేళ ఆ నౌక అమెరికా సైన్యం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే, దానిని అదుపులోకి (Detain) తీసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కానీ అలా చేయకుండా దాడికి దిగడం దారుణం" అని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత విదేశాంగ శాఖ తీవ్ర ఖండన
దీనికి ముందు, ఒమన్ తీరంలో 'ఎంటీ సెట్టెబెల్లో' (MT Settebello) అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఆ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు, ముగ్గురు అదృశ్యమయ్యారని మొదట ప్రకటించింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో కలిసి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపింది.
{{/usCountry}}దీనికి ముందు, ఒమన్ తీరంలో 'ఎంటీ సెట్టెబెల్లో' (MT Settebello) అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఆ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు, ముగ్గురు అదృశ్యమయ్యారని మొదట ప్రకటించింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో కలిసి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపింది.
{{/usCountry}}ప్రాంతీయంగా సాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ నౌకలపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, చర్చల ద్వారా దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొని పశ్చిమాసియాలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.