మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న థాకరే సోదరులు, ముంబై మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మళ్ళీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT), రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాయి.
చారిత్రాత్మక నిర్ణయం: 'మరాఠీ అస్తిత్వం' కోసం ఏకం

ముంబైలో బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు వేదికను పంచుకున్నారు. "మహారాష్ట్ర ప్రజలు ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. శివసేన, MNS లు ఇకపై కలిసి పనిచేస్తాయని నేను ప్రకటిస్తున్నాను" అని రాజ్ థాకరే మరాఠీలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ముంబై మేయర్ పీఠంపై కచ్చితంగా ఒక మరాఠీ వ్యక్తిని, అది కూడా తమ రెండు పార్టీలలో ఒకరిని కూర్చోబెడతామని ఆయన శపథం చేశారు.
అనంతరం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. "మరాఠీ ప్రజలు సాధారణంగా ఎవరినీ ఇబ్బంది పెట్టరు, కానీ ఎవరైనా తమ దారికి అడ్డువస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు" అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికల బరిలో ఉమ్మడి పోరు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు థానే, కళ్యాణ్-డోంబివిలి, నాసిక్ వంటి కీలక నగరాల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగనుంది. జనవరి 15న పోలింగ్ జరగనుండగా, జనవరి 16న ఫలితాలు వెలువడనున్నాయి. సీట్ల పంపకాలపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, ముంబైలో శివసేన (UBT) సుమారు 145-150 స్థానాల్లో, MNS 65-70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విభేదాల నుంచి పొత్తు దాకా..
2006లో శివసేన నుంచి బయటకు వచ్చి MNS స్థాపించిన రాజ్ థాకరే, అప్పటి నుండి ఉద్ధవ్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేవారు. అయితే, జూలైలో హిందీ భాషా రుద్దుడుకు వ్యతిరేకంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారి వేదిక పంచుకున్నారు. అప్పుడే ఈ పొత్తుకు బీజం పడింది. తాజాగా ముంబైపై పట్టు సాధించే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు 'బ్రాండ్ థాకరే'ని మళ్ళీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
{{/usCountry}}2006లో శివసేన నుంచి బయటకు వచ్చి MNS స్థాపించిన రాజ్ థాకరే, అప్పటి నుండి ఉద్ధవ్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉండేవారు. అయితే, జూలైలో హిందీ భాషా రుద్దుడుకు వ్యతిరేకంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారి వేదిక పంచుకున్నారు. అప్పుడే ఈ పొత్తుకు బీజం పడింది. తాజాగా ముంబైపై పట్టు సాధించే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు 'బ్రాండ్ థాకరే'ని మళ్ళీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు, ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. NCP (శరద్ పవార్) వర్గంతో థాకరే సోదరులు చర్చలు జరుపుతున్నారు. ఈ కొత్త కూటమి రాబోయే ఎన్నికల్లో అధికార మహాయుతి (BJP-ఏకనాథ్ షిండే-అజిత్ పవార్) కూటమికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.