Maruti Upcoming Cars : గెట్ రెడీ.. మారుతి నుంచి 1 సంవత్సరంలోనే ఈ 5 కార్లు విడుదల
మారుతి సుజుకి వచ్చే ఏడాది అంటే 2027 నాటికి భారత మార్కెట్లో అనేక కార్లను విడుదల చేయబోతోంది. ఈ కార్లలో కొత్త మోడళ్లతోపాటు ఇప్పటికే ఉన్న కార్ల అప్డేట్ వెర్షన్లు కూడా ఉంటాయి.

మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ న్యూస్ మీకు యూజ్ అవుతుంది. మారుతి సుజుకి కార్లకు ఎల్లప్పుడూ భారత మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మారుతి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కంపెనీ ఇప్పుడు రెడీ అవుతోంది. ఈ క్రమంలో కంపెనీ వచ్చే ఏడాది అంటే 2027 నాటికి భారత మార్కెట్లో అనేక కార్లను విడుదల చేయబోతోంది.
ఈ కార్లలో కొత్త మోడళ్లతో పాటు కంపెనీ ప్రసిద్ధ కార్ల అప్డేట్ వెర్షన్లు కూడా ఉంటాయి. రాబోయే ఈ 5 మోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
న్యూ మారుతి బ్రెజ్జా
మారుతి బెస్ట్ సెల్లింగ్ సబ్-కాంపాక్ట్ కారు బ్రెజ్జా 2026 మూడో త్రైమాసికంలో కొత్త ఫేస్ లిఫ్ట్ ను పొందబోతోంది. కొత్త కారు మార్చిన బంపర్, కొత్త గ్రిల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో లుక్ పూర్తిగా అట్రాక్టివ్గా ఉంటుంది. అతిపెద్ద మార్పు దాని ఇంజిన్ లో ఉంటుంది. కంపెనీ శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను తిరిగి తీసుకువస్తుంది. ఇది 99 బీహెచ్పీ శక్తిని ఇస్తుంది. అలాగే దాని సీఎన్జీ వేరియంట్లో దిగువన ట్యాంక్ ఇవ్వడం ద్వారా, బూట్ స్పేస్ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.
మారుతి బాలెనో
కొత్త మారుతి బాలెనో కూడా రాబోయే నెలల్లో అప్డేట్తో లాంచ్ కానుంది. టెస్టింగ్ సమయంలో చూసిన చిత్రాల ప్రకారం, ఇది కొత్త రేడియేటర్ గ్రిల్, కొత్త బంపర్, మారిన హెడ్ ల్యాంప్స్తో రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మారుతి 1.0-లీటర్ మూడు-సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కూడా తిరిగి ప్రవేశపెడుతుంది.
మారుతి ఫ్రాంక్స్
కొత్త మారుతి ఫ్రాంక్స్ కూడా వచ్చే ఏడాది కొత్త, చాలా ఆధునిక అవతార్లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో కొత్త బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్లు లభిస్తాయి. సరికొత్త పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్తో వస్తుంది.
మారుతి వై 43
చిన్న కార్లను దుమ్ము దులిపేయడానికి మారుతి సరికొత్త పెట్రోల్ మైక్రో-కారుపై పని చేస్తోంది. దీనికి 'వై 43' అనే కోడ్ నేమ్ ఉంది. ఈ కారు చాలా ఆధునిక డిజైన్తో వస్తుంది. యువతను ఆకర్షించడానికి సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్, సి-టైప్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంటుంది. మారుతికి చెందిన ఈ కొత్త కారు ఎంట్రీ 2027 సంవత్సరంలో ఉండవచ్చు.
కొత్త మారుతి గ్రాండ్ విటారా
మారుతి తన ప్రీమియం పెట్రోల్ కారు గ్రాండ్ విటారాకు వచ్చే ఏడాది కొత్త ఫేస్ లిఫ్ట్ ఇవ్వబోతోంది. ఈ కొత్త అప్డేట్తో, కారు లెవల్ -2 ఏడీఏఎస్, పవర్డ్ టెయిల్ గేట్, వెంటిలేటెడ్ డ్రైవర్ సీటు వంటి సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది. అలాగే దాని సీఎన్జీ వేరియంట్ దిగువన సిలిండర్ను కూడా అమర్చనున్నారు. దీంతో బూట్ స్పేస్కు కొరత ఉండదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


