...
...
Next Story

కోట్లాది ప్రజల గుండె చప్పుడు.. ‘వందేమాతరం’ గీతానికి 150ఏళ్లు!

'వందేమాతరం'కు ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయ్యాయి! ఈ గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించారు. ఈ నేపథ్యంలో 150ఏళ్ల చరిత్రగల వందేమాతరం గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూడండి..

Published on: Nov 7, 2025, 10:00:09 IST
Advertisement

కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన 'వందేమాతరం'కు నేటితో 150 ఏళ్లు నిండాయి! ఈ గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించారు. నవంబర్ 7, 1875న మొట్టమొదటిసారి సాహిత్య పత్రిక ‘బంగదర్శన్’లో ఈ గీతం ప్రచురితమైంది.

బంకిమ్​ చంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం'కి 150ఏళ్లు! (Pixabay)
బంకిమ్​ చంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం'కి 150ఏళ్లు! (Pixabay)

'తల్లీ, నీకు నమస్కరిస్తున్నాను' అని అక్షరాలా అర్థం వచ్చే ఈ గీతాన్ని, ఛటర్జీ తన చిరస్మరణీయ నవల ‘ఆనందమఠ్’లో చేర్చారు. ఈ నవల 1882లో ప్రచురితమైంది. దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతాన్ని సమకూర్చారు. ఠాగూర్ దీనిని 1896 కలకత్తా కాంగ్రెస్ సెషన్‌లో ఆలపించారు.

వందేమాతరంను రాజకీయ నినాదంగా మొట్టమొదట ఆగస్టు 7, 1905న ఉపయోగించారు. అయితే, దీనిని భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించడానికి 1950 వరకు వేచి చూడాల్సి వచ్చింది.

వందేమాతరం గురించి కీలక విషయాలు..

బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠ్ నవలను మొదట ఆయన బెంగాలీ మాసపత్రిక బంగదర్శన్​లో ధారావాహికగా ప్రచురించారు.

నవల సీరియలైజేషన్‌లో మొదటి భాగంలోనే, అంటే మార్చి-ఏప్రిల్ 1881 సంచికలో, "వందేమాతరం" పాట ప్రచురితమైంది.

అక్టోబర్ 1905లో, ఉత్తర కలకత్తాలో బందేమాతరం సంప్రదాయ స్థాపించారు. దీని లక్ష్యం మాతృభూమిని ఒక మతపరమైన ప్యాషన్​గా ప్రోత్సహించడం.

ప్రతి ఆదివారం, ఈ సమాజ సభ్యులు ప్రభాత ఫేరీలలో పాల్గొని, "వందేమాతరం" పాడుతూ మాతృభూమికి మద్దతుగా స్వచ్ఛంద విరాళాలు స్వీకరించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అప్పుడప్పుడు ఈ సంప్రదాయ ప్రభాత ఫేరీలలో పాల్గొనేవారు.

ఆగస్టు 1906లో, బిపిన్ చంద్ర పాల్ సంపాదకత్వంలో బందేమాతరం అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభమైంది. దీనికి శ్రీ అరబిందో తరువాత జాయింట్ ఎడిటర్‌గా చేరారు. ఈ పత్రిక తన పదునైన, ఒప్పించే సంపాదకీయాలతో భారతదేశ జాగృతికి శక్తివంతమైన సాధనంగా మారింది. దేశమంతటా స్వయం సమృద్ధి, ఐక్యత, రాజకీయ చైతన్యం సందేశాన్ని ఇది వ్యాప్తి చేసింది.

బ్రిటిష్​ ప్రభుత్వం ఆంక్షలు..

నవంబర్ 1905లో, బెంగాల్‌ రంగపూర్​లోని ఒక పాఠశాలలో వందేమాతరం పాడారన్న కారణంతో 200 మంది విద్యార్థులకు రూ. 5వేల జరిమానా విధించారు.

రంగపూర్‌లో, ప్రముఖ విభజన వ్యతిరేక నాయకులకు ప్రత్యేక కానిస్టేబుళ్లుగా పనిచేయాలని, వందేమాతరం నినాదాన్ని ఆపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నవంబర్ 1906లో, మహారాష్ట్రలోని ధూళియాలో జరిగిన భారీ సమావేశంలో వందేమాతరం నినాదాలు వినిపించాయి.

1907లో, భికాజీ కామా జర్మనీలోని స్టట్‌గార్ట్, బెర్లిన్ నగరాల్లో మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు, దానిపై వందేమాతరం అనే పదాలు కనిపించాయి.

1908లో, కర్ణాటకలోని బెళగాంలో, లోక్‌మాన్య తిలక్‌ను బర్మాలోని మండలేకు బహిష్కరిస్తున్న రోజున, ప్రభుత్వం వందేమాతరం నినాదాన్ని నిషేధిస్తూ మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, దానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు పోలీసులు చాలా మంది బాలురను కొట్టి, పలువురిని అరెస్టు చేశారు.

రాజ్యాంగంలో స్థానం

రాజ్యాంగ సభలో జన గణ మన, వందేమాతరం రెండింటినీ జాతీయ చిహ్నాలుగా స్వీకరించడంలో పూర్తి ఏకాభిప్రాయం ఉంది. ఈ విషయంపై ఎటువంటి చర్చ జరగలేదు.

జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం పోషించిన ముఖ్యమైన పాత్ర కారణంగా, దీనికి జన గణ మన మాదిరిగానే హోదా ఉండాలని, సమానంగా గౌరవించాలని కోరారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks