ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మానవ ప్రయత్నాలకు తోడుగా నిలిచే మూగజీవాల విశ్వాసం మరోసారి నిరూపితమైంది. వెనిజులాను అతలాకుతలం చేసిన భీకర భూకంపాల శిథిలాల మధ్య 'సునామీ' అనే రెస్క్యూ డాగ్ చేసిన సాహసోపేత సహాయక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. తన అద్భుతమైన ఘ్రాణ శక్తితో శిథిలాల కింద చిక్కుకున్న 13 మంది ప్రాణాలను కాపాడి, ఈ ఎనిమిదేళ్ల బోర్డర్ కొల్లీ (Border Collie) జాతి కుక్క నిజమైన రక్షకుడిగా నిలిచింది.
వందేళ్లలో ఎరుగని విపత్తు
గత జూన్ 24న వెనిజులాలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని వణికించాయి. వందేళ్ల కాలంలో వెనిజులా ఎదుర్కొన్న అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. జూలై 7 నాటికి అందిన అధికారిక లెక్కల ప్రకారం ఈ విపత్తులో 3,685 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలమట్టమవడంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
శిథిలాల కింద ఆరు రోజులు.. కాపాడిన 'సునామీ'
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కే-సార్ ఈసీఐడీ (K-SAR ECID) రెస్క్యూ కేనైన్ యూనిట్కు చెందిన 'సునామీ' తన హ్యాండ్లర్ జార్జ్ బీన్స్తో కలిసి రంగంలోకి దిగింది. కూలిపోయిన భవనాల కింద మనుషులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని సునామీ తన వాసన పసిగట్టే నైపుణ్యంతో ఖచ్చితంగా గుర్తించింది. సునామీ ఇచ్చిన సంకేతాలతో రెస్క్యూ టీమ్లు శిథిలాలను తొలగించి బాధితులను సురక్షితంగా బయటకు తీశాయి. అలా ప్రాణాలు దక్కించుకున్న వారిలో ఆరు రోజుల పాటు శిథిలాల కిందే చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు సీఎన్ఎన్ ప్రతినిధులు వెల్లడించారు.
"భూకంపాల వల్ల కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి మా నాలుగు కాళ్ల రెస్క్యూ హీరో మొత్తం 25 మందిని ప్రాణాలతో కాపాడగలిగింది" అని వెనిజులా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఘనంగా వీడ్కోలు.. సునామీ రిటైర్మెంట్
ఈ బోర్డర్ కొల్లీకి రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టర్కీ, సిరియా భూకంపాల సమయంలోనూ, వెనిజులాలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల్లోనూ సునామీ ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. అయితే, తాజా భూకంప రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సునామీకి విశ్రాంతి ఇవ్వాలని కే-సార్ ఈసీఐడీ (K-SAR ECID) నిర్ణయించింది.
{{/usCountry}}ఈ బోర్డర్ కొల్లీకి రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టర్కీ, సిరియా భూకంపాల సమయంలోనూ, వెనిజులాలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రమాదాల్లోనూ సునామీ ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. అయితే, తాజా భూకంప రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సునామీకి విశ్రాంతి ఇవ్వాలని కే-సార్ ఈసీఐడీ (K-SAR ECID) నిర్ణయించింది.
{{/usCountry}}"తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడే సునామీ రిటైర్ అవుతోంది. మైదానంలో తన ధైర్యాన్ని, అంకితభావాన్ని మరోసారి నిరూపించుకుంది" అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
వెనిజులా విపత్తు నుంచి కోలుకుంటున్న తరుణంలో సునామీ లాంటి రెస్క్యూ డాగ్స్ కథలు బాధితుల్లో ఎంతో ఆశను కల్పిస్తున్నాయి. సరైన శిక్షణ, బృందస్ఫూర్తి ఉంటే ఒక సాదాసీదా మూగజీవం కూడా ప్రపంచం మెచ్చే హీరోగా మారగలదని ఈ సంఘటన నిరూపించింది. గత 10 రోజులుగా సాగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్లలో మొత్తం 137 రెస్క్యూ డాగ్స్ పాల్గొన్నట్లు వెనిజులా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్జ్ వెల్లడించారు.