టెక్నాలజీ ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ, సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినీత్ నాయర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏఐ ప్రభావంతో 50 శాతం ఉద్యోగాలు పోతాయనేది వాస్తవమే అయినా, దానికి సమానంగా కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మారనున్న ఉద్యోగాల ముఖచిత్రం

ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొన్న వినీత్ నాయర్, రాబోయే మార్పులను విశ్లేషించారు. "మనం స్పష్టంగా గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఆటోమేషన్ కారణంగా ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో 50 శాతం పోతాయి. కానీ, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మరో 50 శాతం కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. టెక్నాలజీ సాయంతో సృష్టించబడే ఉద్యోగాల సంఖ్య చాలా పెద్దది" అని ఆయన వివరించారు.
భారత్ ఇప్పటివరకు టెక్నాలజీని కేవలం అనుసరించే (Follower) స్థాయిలోనే ఉందని, అయితే ఇప్పుడు ఏఐ ద్వారా ప్రపంచాన్ని కొత్తగా ఆవిష్కరిస్తూ టెక్నాలజీని శాసించే (Leader) స్థాయికి ఎదుగుతోందని ఆయన కొనియాడారు.
ప్రైవేట్ కంపెనీలపై ఆశలు వద్దు.. స్టార్టప్లే దిక్కు
ఉద్యోగాల కల్పన విషయంలో వినీత్ నాయర్ కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభాల కోసమే పని చేస్తాయని, అవి భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయని ఆశించడం కేవలం ఒక 'కల' మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన జరగాలంటే భారీ ఎత్తున స్టార్టప్లు రావాలి. ప్రభుత్వం ఇప్పటికే స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది, అది మరింత వేగవంతం కావాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ డేటా.. విదేశీ మోడల్స్: ఒక హెచ్చరిక
భారతీయ వినియోగదారుల డేటా భద్రతపై వినీత్ నాయర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అన్నీ భారతీయ డేటాను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నాయని, కానీ మన దగ్గర ప్రపంచ స్థాయి మోడల్స్ లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
{{/usCountry}}భారతీయ వినియోగదారుల డేటా భద్రతపై వినీత్ నాయర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అన్నీ భారతీయ డేటాను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నాయని, కానీ మన దగ్గర ప్రపంచ స్థాయి మోడల్స్ లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
{{/usCountry}}"విదేశీ కంపెనీలు మన డేటాను వాడుకోవడానికి అనుమతించాలా వద్దా అనేది ఒక పెద్ద చర్చ. ఒకవేళ అనుమతించకపోతే మనకు డేటా ఉంటుంది కానీ, దాన్ని వాడే టెక్నాలజీ (LLMs) మన దగ్గర లేదు. కాబట్టి, మన దేశంలోనే ప్రపంచ స్థాయి ఏఐ మోడల్స్ను అభివృద్ధి చేయడానికి టెక్ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. లేదంటే వచ్చే పదేళ్లలో భారత్ తన పోటీ తత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది" అని ఆయన హెచ్చరించారు.