పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా జరుగుతున్న సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని వెల్లడించారు. కానీ భారత ప్రభుత్వం అన్నింటికి సిద్ధంగా ఉందని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులు, భారత్ సన్నద్ధతపై సోమవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రధాని కీలక ప్రసంగం చేశారు.

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. "యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు చాలా సవాలుగా మారాయి. భారత్కు వచ్చే ముడి చమురు, గ్యాస్, ఎరువులు, అనేక నిత్యావసర వస్తువులు ఈ మార్గం ద్వారానే వస్తాయి. అయినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది," అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
“భారత్ దగ్గర 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. అదనపు నిల్వల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు మన చమురు కంపెనీల వద్ద ఇంకా రిజర్వులు ఉన్నాయి,” అని మోదీ వివరించారు.
41 దేశాలతో ఇంధన బంధం..
భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మోదీ తెలిపారు. "గత కొన్నేళ్లుగా భారత్ తన ఇంధన దిగుమతి వనరులను గణనీయంగా వైవిధ్యీకరించింది (డైవర్సిఫై). ప్రస్తుతం మనం 41 దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ను సేకరిస్తున్నాం. దీనివల్ల ఏదైనా ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తినా, దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది," అని ఆయన వివరించారు.
పౌరుల భద్రతే ప్రథమ కర్తవ్యం..
యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి పౌరులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
{{/usCountry}}యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి పౌరులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
{{/usCountry}}“యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3లక్షల 75వేల మంది భారతీయులు మన దేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమాసియాలోని నేతలతో నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాను. భారతీయుల భద్రతపై అందరు హామీ ఇచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. ఇది అత్యంత బాధాకరం,” అని మోదీ తెలిపారు.
ప్రధాని మోదీ సమీక్ష..
అంతకుముందు, పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులను, ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశాన్ని నిర్వహించారు. యుద్ధం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, కార్యదర్శులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఆదివారం జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే భారత్పై పడే ప్రభావం, దాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.