...
...
Next Story

20,000ఎంఏహెచ్​ బ్యాటరీతో షావోమీ కొత్త పవర్​ బ్యాంక్- సూపర్ ఫాస్ట్​గా మీ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్..

గ్యాడ్జెట్స్, లెప్‌టాప్‌లను కూడా నిమిషాల్లో ఛార్జ్ చేసేలా షావోమీ సరికొత్త 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 165డబ్ల్యూ హై-స్పీడ్ ఛార్జింగ్, ఇన్-బిల్ట్ టైప్-సీ కేబుల్, డిజిటల్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ వివరాలు ఇవే..

Published on: Sep 5, 2026, 10:45:21 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు మన జీవితంలో అంతర్భాగంగా మారిన ఈ రోజుల్లో బ్యాటరీ డౌన్ అయితే పనులు ఆగిపోతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం ‘షావోమీ’ భారత మార్కెట్లోకి ఒక పవర్‌ఫుల్ ఛార్జింగ్ యాక్సెసరీని తీసుకోస్తోంది. ఏకంగా 165డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 'షావోమీ పవర్ బ్యాంక్ 20000ఎంఏహెచ్ 165డబ్ల్యూ' ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

షావోమీ పవర్ బ్యాంక్.. (Representative Image)
షావోమీ పవర్ బ్యాంక్.. (Representative Image)

ఈ సరికొత్త పవర్ బ్యాంక్ సెప్టెంబర్ 8వ తేదీన భారత విపణిలో అధికారికంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌లోకి వచ్చింది.

30 నిమిషాల్లో ల్యాప్‌టాప్ సగం ఛార్జ్!

ఈ పవర్ బ్యాంక్ ప్రధాన ఆకర్షణ దీని 165డబ్ల్యూ హై-అవుట్‌పుట్ కెపాసిటీ. ఇందులో ఉన్న 20,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కేవలం స్మార్ట్‌ఫోన్లకే కాకుండా, ఎక్కువ విద్యుత్ అవసరమయ్యే టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్స్, హెవీ గేమింగ్ పరికరాలను కూడా చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ప్రయోగాత్మక పరిస్థితుల్లో ఈ పవర్ బ్యాంక్ కేవలం 30 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్ బ్యాటరీని 50 శాతానికి పైగా ఛార్జ్ చేయగలదు.

ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేస్తున్నప్పుడు కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఒక పోర్ట్ ద్వారా 120డబ్ల్యూ, మరొక పోర్ట్ ద్వారా 45డబ్ల్యూ చొప్పున మొత్తం 165డబ్ల్యూ పవర్ డెలివరీని అందిస్తుంది.

డిజిటల్ కలర్ డిస్‌ప్లే, ఇన్-బిల్ట్ కేబుల్..

సాధారణ పవర్ బ్యాంక్స్​లో బ్యాటరీ ఎంత ఉందో తెలుసుకోవడానికి చిన్న ఎల్​ఈడీ లైట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ప్రీమియం షావోమీ పవర్ బ్యాంక్‌లో ప్రత్యేకంగా ఒక 'డిజిటల్ కలర్ డిస్‌ప్లే'ను అమర్చారు. ఈ స్క్రీన్ ద్వారా:

  • పవర్ బ్యాంక్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ శాతం,
  • ప్రస్తుతం ఏ స్పీడ్‌తో (వాట్స్) ఛార్జ్ అవుతోంది,
  • డివైజ్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, వంటి వివరాలను లైవ్‌లో తెలుసుకోవచ్చు.

ఎక్కువ పవర్ అవుట్‌పుట్ ఇచ్చే పరికరాల్లో భద్రత చాలా ముఖ్యం. అందుకోసమే షావోమీ ఇందులో 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను అందించింది. అడాప్టివ్ పవర్ అడ్జస్ట్‌మెంట్, ఆటోమేటిక్ టెంపరేచర్ మేనేజ్‌మెంట్ ద్వారా పవర్ బ్యాంక్ వేడెక్కకుండా, షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా రక్షణ లభిస్తుంది.

ఇది యూఎస్బీ పవర్ డెలివరీ (పీడీ) 3.0 పీపీఎస్​తో పాటు క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్ 3.5, క్యూసీ 3.0, క్యూసీ 2.0 వంటి ప్రధాన ఛార్జింగ్ ప్రోటోకాల్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లతో పాటు తక్కువ పవర్ అవసరమయ్యే బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను కూడా ఇది సురక్షితంగా ఛార్జ్ చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ఎనర్జీ కెపాసిటీ 76డబ్ల్యూహెచ్ కావడం వల్ల, విమాన ప్రయాణాల్లో హ్యాండ్ లగేజీలో తీసుకెళ్లడానికి అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం అనుమతి ఉంటుంది.

ధర ఎంత ఉండవచ్చు?

జులై నెలలో షావోమీ భారత్‌లో 'షావోమీ పవర్ బ్యాంక్ 5ఐ 20000ఎంఏహెచ్ (67డబ్ల్యూ)' మోడల్‌ను రూ. 3,499 ధరకు విడుదల చేసింది. ఆ మోడల్ 67డబ్ల్యూ అవుట్‌పుట్‌ను మాత్రమే ఇచ్చేది. ప్రస్తుతం వస్తున్న కొత్త మోడల్ 165డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, డిజిటల్ స్క్రీన్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్నందున, దీని ధర భారత మార్కెట్లో సుమారు రూ. 4,500 నుంచి రూ. 5,500 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 8న దీని అధికారిక ధర వెల్లడి కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe