Delhi Punjab match : ఈ ఐపీఎల్ సీజన్లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఎట్టకేలకు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ధర్మశాలలోని చల్లని వాతావరణంలో, బౌలర్లకు చెమటలు పుట్టించే బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్కు షాక్ ఇచ్చింది. గతంలో తమ సొంత మైదానంలో పంజాబ్ చేతిలో 265 పరుగుల ఛేజింగ్లో ఓడిపోయిన దిల్లీ.. ఈసారి వారిని వారి ఇలాకాలోనే దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకుంది.

సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ఈ పిచ్పై సీమర్లకు లభించే సహకారాన్ని గమనించిన కెప్టెన్ అక్షర్ పటేల్, టాస్ గెలిచి ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. వాతావరణానికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్లో మొత్తం 40 ఓవర్లను పేసర్లే వేయడం ఒక అరుదైన రికార్డు.
ఛేజింగ్లో తడబడి.. నిలబడి!
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీకి ఆరంభం ఆశాజనకంగా లేదు. అభిషేక్ పోరెల్ డకౌట్ కాగా, స్టార్ ప్లేయర్ కెఎల్ రాహుల్ కూడా అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఒక దశలో దిల్లీ 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అక్షర్ - మిల్లర్ 'మిషన్ ఇంపాజిబుల్'!
ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్, అనుభవజ్ఞుడైన డేవిడ్ మిల్లర్ అసాధారణ పోరాటాన్ని కనబరిచారు. అక్షర్ 30 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టులో జోష్ నింపగా, 'కిల్లర్' మిల్లర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో 28 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కేవలం 34 బంతుల్లోనే 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను దిల్లీ వైపు తిప్పారు.
చివరి ఓవర్లలో ఉత్కంఠ రేపినప్పటికీ, యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ (24), మాధవ్ తివారీ (18*) సంయమనంతో ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే 216/7 పరుగులతో విజయాన్ని ఖరారు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (2/21) పొదుపుగా బౌలింగ్ చేసినా, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పంజాబ్కు వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు.
పంజాబ్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం..
{{/usCountry}}చివరి ఓవర్లలో ఉత్కంఠ రేపినప్పటికీ, యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ (24), మాధవ్ తివారీ (18*) సంయమనంతో ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే 216/7 పరుగులతో విజయాన్ని ఖరారు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (2/21) పొదుపుగా బౌలింగ్ చేసినా, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పంజాబ్కు వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు.
పంజాబ్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం..
{{/usCountry}}అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఆరంభం నుంచే దిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఆర్య (56 పరుగులు, 33 బంతులు, 6 సిక్సర్లు), మిచెల్ స్టార్క్ వేసిన ఒకే ఓవర్లో 22 పరుగులు సాధించాడు. అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (59* పరుగులు, 36 బంతులు) తన క్లాస్ ఆటతీరుతో పంజాబ్ను 200 దాటించాడు. దిల్లీ బౌలర్లలో డెబ్యూటెంట్ మాధవ్ తివారీ (2/40) తన వేగంతో ఆకట్టుకున్నాడు.
తాజా గెలుపుతో డీసీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఈ జట్టు 10 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఇక 13 పాయింట్లతో పీబీకేఎస్ 4వ స్థానంలో కొనసాగుతోంది.