యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ పేసర్ యోగరాజ్ సింగ్ పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చి కొత్త వివాదానికి నిప్పు రాజేశారు. ఇన్సైడ్స్పోర్ట్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యువరాజ్ సింగ్ను భారతదేశపు గొప్ప క్రికెటర్గా అభివర్ణించడమే కాకుండా, తన కొడుకు ప్రతిభను చూసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి భయపడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆల్ టైమ్ గ్రేట్

భారతదేశపు గొప్ప క్రికెటర్ ఎవరు? అనే చర్చ మరోసారి జరుగుతున్న నేపథ్యంలో యోగరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యోగరాజ్ సమాధానాలు చాలా ఘాటుగా, వివాదాస్పదంగా ఉన్నాయి. యోగరాజ్ నమ్మకం ప్రకారం యువరాజ్ ఇండియా ఆల్-టైమ్ గ్రేట్.
"మీరు ఆల్-రౌండర్ల గురించి మాట్లాడితే కపిల్ దేవ్ ఉన్నారు. బ్యాట్స్మెన్ల గురించి మాట్లాడితే యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి వారు ఉన్నారు. కానీ నా దృష్టిలో యువీ వీరందరి కంటే అగ్రస్థానంలో ఉన్నాడు" అని యోగరాజ్ అన్నారు.
టెస్టు కెరీర్
యువరాజ్ టెస్ట్ కెరీర్ గురించి యోగరాజ్ మాట్లాడుతూ.. "అతను సుమారు 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి, బహుశా 200 సెంచరీలు చేసి ఉండేవాడు. అతనికి ఆ సామర్థ్యం ఉందని నేను భావించా" అని యోగరాజ్ అన్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నత స్థాయి క్రీడలలో ఉండే గట్టి పోటీని ఉటంకిస్తూ, యువరాజ్ చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉండేదని యోగరాజ్ అన్నారు.
యువీని చూసి
"నేను మీకు చెప్పినట్లుగా విజయం, డబ్బు, కీర్తి ఉన్న ఈ రంగంలో స్నేహితులు ఉండరు. ఎప్పుడూ వెన్నుపోటుదారులు ఉంటారు. మిమ్మల్ని కిందికి లాగాలనుకునే వారు ఉంటారు. యువరాజ్ సింగ్ను చూసి భయపడ్డారు. ఎందుకంటే అతను వారి స్థానాలను లాక్కుంటాడని భయపడ్డారు. అతను దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. అందుకే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీతో సహా అందరూ భయపడ్డారు. 'ఓహ్, అతను నా ప్లేస్ ను లాక్కుంటాడేమో' అని భయపడ్డారు" అని యోగరాజ్ అన్నారు.
బలి పశువు
గతంలో కూడా యోగరాజ్ సింగ్ తన కొడుకుకు సరైన అవకాశాలు రాలేదని, జట్టులోని రాజకీయాలకు బలిపశువు అయ్యాడని పలుమార్లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై యువరాజ్ సింగ్ ఎప్పుడూ స్పందించనప్పటికీ, యువరాజ్కు అర్హమైన కెరీర్ను భారత యాజమాన్యం నిరాకరించిందని యోగరాజ్ పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లను భారత్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.
{{/usCountry}}గతంలో కూడా యోగరాజ్ సింగ్ తన కొడుకుకు సరైన అవకాశాలు రాలేదని, జట్టులోని రాజకీయాలకు బలిపశువు అయ్యాడని పలుమార్లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై యువరాజ్ సింగ్ ఎప్పుడూ స్పందించనప్పటికీ, యువరాజ్కు అర్హమైన కెరీర్ను భారత యాజమాన్యం నిరాకరించిందని యోగరాజ్ పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లను భారత్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.
{{/usCountry}}2011 టోర్నమెంట్లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి, దానితో పోరాడి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే అతని కెరీర్ క్రమంగా మసకబారింది.