...
...
Next Story

Zepto IPO: జెప్టో ఐపీఓ రెడీ: రూ. 8,010 కోట్ల తాజా షేర్లతో సెబీకి దరఖాస్తు

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ 'జెప్టో' స్టాక్ మార్కెట్ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఓ ద్వారా రూ. 8,010 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు 11.3 కోట్ల షేర్లను విక్రయించడానికి సెబీకి అప్‌డేటెడ్ పత్రాలను సమర్పించింది.

Published on: Jun 09, 2026 09:27 AM IST
Advertisement

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'జెప్టో' (Zepto) దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది. పబ్లిక్ ఇష్యూ (IPO) కు వెళ్లే ప్రక్రియలో భాగంగా భారతీయ సెక్యూరిటీల నియంత్రణ మండలి (SEBI) కి అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ను సమర్పించింది.

ఐపీఓ ద్వారా రూ. 8,010 కోట్ల నిధుల సేకరణ

జెప్టో ఐపీఓ రెడీ: రూ. 8,010 కోట్ల తాజా షేర్లతో సెబీకి దరఖాస్తు
జెప్టో ఐపీఓ రెడీ: రూ. 8,010 కోట్ల తాజా షేర్లతో సెబీకి దరఖాస్తు

ఈ తాజా డీఆర్‌హెచ్‌పీ ప్రకారం, కంపెనీ రూ. 8,010 కోట్ల విలువైన తాజా షేర్లను (Fresh Issue) జారీ చేయనుంది. దీనితో పాటు సంస్థలో పెట్టుబడులు పెట్టిన పాత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 11.3 కోట్ల (113 మిలియన్) షేర్లను విక్రయించనున్నారు. జెప్టో గత ఏడాది డిసెంబర్ 2025లో 'కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్' పద్ధతి ద్వారా తొలిసారి ఐపీఓ పత్రాలను దాఖలు చేయగా, గత నెల మేలో సెబీ నుంచి ఇందుకు ఆమోదం లభించింది.

ఆఫర్ ఫర్ సేల్ (OFS) విభాగంలో కంపెనీ ప్రారంభ ఇన్వెస్టర్లయిన నెక్సస్ వెంచర్ పార్టనర్స్, అమెరికాకు చెందిన కాంట్రరీ క్యాపిటల్, కైజర్ పర్మనెంట్, దుబాయ్ బేస్డ్ రేజర్ క్యాపిటల్ వంటి సంస్థలు తమ వాటాలను విక్రయించి నిధులను వెనక్కి తీసుకోనున్నాయి.

జూలైలోనే స్టాక్ మార్కెట్ ఎంట్రీ

"కంపెనీ వచ్చే జూలై నాటికి స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది," అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే గనుక జరిగితే, భారతదేశంలో పబ్లిక్ ట్రేడింగ్‌కు వెళ్తున్న మూడో క్విక్-కామర్స్ కంపెనీగా జెప్టో నిలుస్తుంది. ఇప్పటికే ఎటర్నల్, స్విగ్గీ (Swiggy) లు మార్కెట్లో లిస్ట్ అయి ట్రేడ్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe