సనాతన హిందూ ధర్మంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక్ మాసం లేదా పురుషోత్తమ మాసానికి (మాల్మాస్) ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏడాది…. జూన్ 15, 2026, సోమవారం నాటి అధిక మాసం చివరి రోజున ఒక అద్భుతమైన యాదృచ్ఛికం చోటుచేసుకుంది. ఈ ముగింపు రోజున పరమ పవిత్రమైన "సోమవతి అమావాస్య" రావడం వల్ల ఈ రోజున చేసే దానధర్మాలు, స్నానాలు మరియు ప్రత్యేక పూజలకు అక్షయ పుణ్యఫలం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన రోజున ఆచరించే కొన్ని సులభమైన పరిహారాల వల్ల శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీస్సులు లభించి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

అధిక మాసం చివరి రోజున దీపదానానికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసానికి అధిపతి శ్రీమ హావిష్ణువు కావడం వల్ల, మాల్మాస్ చివరి రోజున 33 దీపాలను వెలిగించి దానం చేయడం అత్యంత శుభప్రదంగా మరియు అనంతమైన ఫలప్రదంగా పరిగణించబడుతుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం… 33 సంఖ్యను 33 కోట్ల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ రోజున 33 దీపాలను దానం చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరినీ ఒకేసారి పూజించినంత ఫలితం దక్కుతుంది. ఈ దీపదానం నేరుగా విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుందని, దీనివల్ల మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోయి, లక్ష్మీదేవి కరుణతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు బలంగా నమ్ముతారు.
ఈ రోజు తప్పక చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు
ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొంది, ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉండాలంటే ఈ రోజున క్రింది ఆచారాలను పాటించాలి…
1. విష్ణు మంత్రాల జపం : పురుషోత్తమ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ చివరి రోజున లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం విష్ణు మంత్రాలను పఠించడంతో పాటు, 'విష్ణు సహస్రనామ' పారాయణం లేదా జపం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
2. శక్తి కొలది దానధర్మాలు : మాల్మాస్ ముగింపు వేళ మీ స్తోమతకు తగినట్లుగా పేదలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు, డబ్బు మరియు పండ్లను దానం చేయాలి. ఈ రోజున చేసే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది.
{{/usCountry}}2. శక్తి కొలది దానధర్మాలు : మాల్మాస్ ముగింపు వేళ మీ స్తోమతకు తగినట్లుగా పేదలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు, డబ్బు మరియు పండ్లను దానం చేయాలి. ఈ రోజున చేసే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది.
{{/usCountry}}3. తులసి కోట దగ్గర దీపారాధన : హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. ఈ రోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి, భక్తితో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై…. ఆ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుందని నమ్ముతారు.
4. వ్రత ఉద్యాపన : ఒకవేళ మీరు ఈ అధిక మాసం పొడవునా ఏదైనా ప్రత్యేక జపం, తపస్సు, ఉపవాసం లేదా దాన నియమాలను పాటించి ఉన్నట్లయితే, ఈ చివరి రోజున వాటికి సంబంధించిన ఉద్యాపనను (ముగింపు పూజను) శాస్త్రోక్తంగా, క్రమపద్ధతిలో నిర్వహించుకోవాలి.