సోమవతి అమావాస్య వేళ అరుదైన యోగం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇవాళ చేయాల్సిన పరిహారాలు!

ఇవాళ్టితో అధిక మాసం ముగుస్తోంది. సోమవతి అమావాస్య అరుదైన కలయికతో ఉన్న ఈ చివరి రోజున ఆర్థిక ఇబ్బందులు తొలగి, సంపద పెరగడానికి చేయాల్సిన ప్రత్యేక పరిహారాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 15, 2026, 08:07:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సనాతన హిందూ ధర్మంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక్ మాసం లేదా పురుషోత్తమ మాసానికి (మాల్మాస్) ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏడాది…. జూన్ 15, 2026, సోమవారం నాటి అధిక మాసం చివరి రోజున ఒక అద్భుతమైన యాదృచ్ఛికం చోటుచేసుకుంది. ఈ ముగింపు రోజున పరమ పవిత్రమైన "సోమవతి అమావాస్య" రావడం వల్ల ఈ రోజున చేసే దానధర్మాలు, స్నానాలు మరియు ప్రత్యేక పూజలకు అక్షయ పుణ్యఫలం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన రోజున ఆచరించే కొన్ని సులభమైన పరిహారాల వల్ల శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీస్సులు లభించి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

అధిక మాసం ముగింపు
అధిక మాసం ముగింపు

అధిక మాసం చివరి రోజున దీపదానానికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసానికి అధిపతి శ్రీమ హావిష్ణువు కావడం వల్ల, మాల్మాస్ చివరి రోజున 33 దీపాలను వెలిగించి దానం చేయడం అత్యంత శుభప్రదంగా మరియు అనంతమైన ఫలప్రదంగా పరిగణించబడుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం… 33 సంఖ్యను 33 కోట్ల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ రోజున 33 దీపాలను దానం చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరినీ ఒకేసారి పూజించినంత ఫలితం దక్కుతుంది. ఈ దీపదానం నేరుగా విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుందని, దీనివల్ల మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోయి, లక్ష్మీదేవి కరుణతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు బలంగా నమ్ముతారు.

ఈ రోజు తప్పక చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు

ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొంది, ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉండాలంటే ఈ రోజున క్రింది ఆచారాలను పాటించాలి…

1. విష్ణు మంత్రాల జపం : పురుషోత్తమ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ చివరి రోజున లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం విష్ణు మంత్రాలను పఠించడంతో పాటు, 'విష్ణు సహస్రనామ' పారాయణం లేదా జపం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

2. శక్తి కొలది దానధర్మాలు : మాల్మాస్ ముగింపు వేళ మీ స్తోమతకు తగినట్లుగా పేదలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు, డబ్బు మరియు పండ్లను దానం చేయాలి. ఈ రోజున చేసే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది.

3. తులసి కోట దగ్గర దీపారాధన : హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. ఈ రోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి, భక్తితో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై…. ఆ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుందని నమ్ముతారు.

4. వ్రత ఉద్యాపన : ఒకవేళ మీరు ఈ అధిక మాసం పొడవునా ఏదైనా ప్రత్యేక జపం, తపస్సు, ఉపవాసం లేదా దాన నియమాలను పాటించి ఉన్నట్లయితే, ఈ చివరి రోజున వాటికి సంబంధించిన ఉద్యాపనను (ముగింపు పూజను) శాస్త్రోక్తంగా, క్రమపద్ధతిలో నిర్వహించుకోవాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More