తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ఆగస్టులో స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే భక్తుల కోసం టీటీడీ ఆన్లైన్ కోటాను రిలీజ్ చేయబోతోంది. దర్శన టికెట్లతో పాటు వసతి గదుల బుకింగ్, ప్రత్యేక సేవల వివరాలను అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఈరోజు అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు

మే 23 అనగా ఈరోజు ఆగస్టు కోటాకు సంబంధించి కొన్ని సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకు వస్తుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ (https://ttdevasthanams.ap.gov.in/home/dashboard) ద్వారా అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈరోజు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల సమయం: ఉదయం 10 గంటలకు.
ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా విడుదల సమయం: ఉదయం 11 గంటలకు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది.
దివ్యానుగ్రహ విశేష హోమ దర్శనం
తిరుమల వెళ్లాలనుకునే వారు, దర్శనం కోసం టికెట్లు దొరకని వారు, శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం ద్వారా దర్శనానికి వెళ్లొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న గోప్రదక్షిణ శాల దగ్గర ఈ హోమం నిర్వహిస్తారు. ఈ టికెట్ ధర ఇద్దరికీ కలిపి రూ.1600. హోమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తారు. ప్రతి నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు?
భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు బుక్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి.
{{/usCountry}}భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు బుక్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి.
{{/usCountry}}ఆఫ్లైన్లో గదులు దొరకనట్లయితే, కొండపై ఉన్న సి.ఆర్.ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో గదులను పొందవచ్చు. రూ.50, రూ.100, రూ.1000ల్లో గదులు అందుబాటులో ఉంటాయి. అయితే గదుల కోసం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల లోపు వెళ్తే గది దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం 24 గంటలకే మాత్రమే గదిని కేటాయించడం జరుగుతుంది.
రూమ్ నిబంధనలు:
ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తప్పక ఉండాలి.
ఒంటరిగా వచ్చే వారికి గది ఇవ్వరు.
21 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి గదులు కేటాయించరు.
పెళ్లి కాని జంటలకు కూడా వసతి సౌకర్యాన్ని అందించరు.
వెంకటేశ్వర శ్లోకం
వినా వెంకటేశం న నాథో, న నాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశా ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
ఈ శ్లోకానికి అర్థం: వెంకటేశ్వర స్వామి తప్ప నాకు వేరే దిక్కులేదు. ఎప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామినే స్మరిస్తున్నాను. ఓ వెంకటేశ్వరా! నాపై అనుగ్రహం చూపించు. నాకు శుభాలను కలిగించు.