...
...
Next Story

Badrinath Story: బద్రీనాథ్ ధామ్ కథ.. బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ఈ కథ తెలుసుకోండి

Badrinath Story: బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కథను తెలుసుకోండి. లక్ష్మీదేవి బద్రి చెట్టుగా మారి విష్ణువును ఎలా రక్షించింది. స్కంద పురాణం మరియు ఇతర పురాణాలలో వివరించిన బద్రీనాథ్ ధామ్ యొక్క పూర్తి కథ, తపతా ప్రాముఖ్యతను ఈ వ్యాసంలో వివరంగా చదవండి.

Published on: Apr 29, 2026, 16:00:54 IST
Advertisement

లక్ష్మీదేవి 'బద్రీ' వృక్షంగా మారిన వేళ..

Badrinath Story: బద్రీనాథ్ ధామ్ కథ.. బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది?
Badrinath Story: బద్రీనాథ్ ధామ్ కథ.. బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది?

పురాణాల ప్రకారం, ఒకప్పుడు విష్ణుమూర్తి హిమాలయాల్లోని కఠినమైన చలిలో లోక కల్యాణం కోసం ఘోర తపస్సులో నిమగ్నమయ్యారు. ఆయన యోగ నిద్రలో ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీగా హిమపాతం మొదలైంది. మంచు కొండలు కరిగి విష్ణువును కప్పేస్తున్నాయి. తన స్వామి చలికి గడ్డకట్టుకుపోవడం చూసి తట్టుకోలేకపోయిన లక్ష్మీదేవి, ఆయనకు రక్షణగా నిలవాలని నిర్ణయించుకుంది.

వెంటనే ఆమె ఒక పెద్ద 'బద్రీ' (రేగు) వృక్షంగా మారి, విష్ణుమూర్తికి గొడుగులా నిలిచింది. పైన పడుతున్న మంచునంతా తనే భరిస్తూ, స్వామివారి తపస్సుకు ఆటంకం కలగకుండా ఏళ్ల తరబడి రక్షణ ఇచ్చింది. విష్ణువు కళ్లు తెరిచి చూసేసరికి మంచులో తడిసి ముద్దయి, గడ్డకట్టుకుపోయిన లక్ష్మీదేవిని చూసి చలించిపోయారు.

"దేవీ! నా కోసం నువ్వు ఇంతటి కష్టాన్ని ఓర్చావు. ఈ క్షేత్రం ఇకపై నీ పేరుతోనే పిలవబడుతుంది. రేగు చెట్టును సంస్కృతంలో 'బద్రి' అంటారు.. అందుకే ఈ స్థలానికి 'బద్రీనాథ్' (బద్రీ వృక్షానికి నాథుడు) అనే పేరు స్థిరపడిపోతుంది" అని వరమిచ్చారు. అందుకే ఇక్కడ విష్ణువును 'బద్రీనారాయణుడు' అని పిలుస్తారు.

అలకనంద తీరాన వెలసిన వైకుంఠం

సముద్ర మట్టానికి సుమారు 3,133 మీటర్ల ఎత్తులో, అలకనంద నది ఒడ్డున చమోలీ జిల్లాలో ఈ అద్భుత దేవాలయం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి ధ్యాన ముద్రలో ఉంటారు. సాధారణంగా మనం విష్ణువును శేషతల్పంపై పడుకున్నట్లు చూస్తాం, కానీ బద్రీనాథ్‌లో మాత్రం ఆయన యోగిలా కనిపిస్తారు. దీనికి కారణం ఇక్కడ ఆయన చేసిన కఠోర తపస్సే. ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ప్రకృతి సిద్ధమైన అందాలకు నిలయం కూడా.

తప్త కుండం: చలిలోనూ వేడి నీళ్ల అద్భుతం

బద్రీనాథ్ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ఆధ్యాత్మిక చింతనతో భక్తులు ఈ కఠిన ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ క్షేత్రంలో లక్ష్మీదేవిని కేవలం విగ్రహ రూపంలోనే కాకుండా, 'బద్రీ వృక్షం' రూపంలో కూడా పూజించడం ఇక్కడి విశిష్టత. ఇది భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి, అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe