భారతీయ సంస్కృతిలో వైశాఖ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది. దీనినే మనం ఎంతో భక్తితో 'బుద్ధ పూర్ణిమ'గా జరుపుకుంటాం. గౌతమ బుద్ధుడు జన్మించినా, జ్ఞానోదయం పొందినా, చివరకు మహాపరినిర్యాణం చెందిన విశిష్ట తిథి ఇదే. అందుకే బౌద్ధులతో పాటు హిందువులకు కూడా ఇది పరమ పవిత్రమైన రోజు. ఈ ఏడాది మే 1వ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తోంది. అయితే, ఈసారి ఆధ్యాత్మికతతో పాటు జ్యోతిష్య రీత్యా కూడా ఈ రోజు అత్యంత శక్తివంతంగా మారనుంది. గ్రహాల గమనంలో సంభవిస్తున్న మార్పుల వల్ల అరుదైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతోంది.
బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి?

మే 1వ తేదీన గ్రహాల స్థితిగతులను గమనిస్తే.. చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు. శని, కుజుడు కలిసి మీన రాశిలో సంచరిస్తుండగా, సూర్యుడు తన ఉచ్ఛ స్థితిలో ఉన్న మేష రాశిలో ఉన్నాడు. అదే రోజు బుధ గ్రహం కూడా మేష రాశిలోకి ప్రవేశించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. దీని వల్ల బుద్ధి బలం పెరగడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ బడ్జెట్ తరహాలోనే ఈ గ్రహ యోగం కూడా సామాన్యుడి జీవితంలో గొప్ప వెలుగులు నింపుతుంది.
ఏయే రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది?
ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి విపరీతమైన రాజభోగాలు కలుగుతాయని జ్యోతిష్య లెక్కలు చెబుతున్నాయి.
1.మేష రాశి:
ఈ రాశిలోనే రాజయోగం ఏర్పడుతుండటంతో మేష రాశి వారికి ఇక తిరుగుండదు. ఆర్థికంగా మీరు ఊహించని లాభాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
2.వృషభ రాశి:
వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది. నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. కార్యాలయాల్లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
3.మీన రాశి:
{{/usCountry}}వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది. నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. కార్యాలయాల్లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
3.మీన రాశి:
{{/usCountry}}మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి అడుగు వేస్తే భారీ ఆదాయాన్ని గడించవచ్చు.
స్వాతి నక్షత్రం - సిద్ధి యోగం కలయిక
ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ రోజున మరో అద్భుతం కూడా ఉంది. దాదాపు 24 గంటల పాటు 'సిద్ధి యోగం' ఉంటుంది. అలాగే 'స్వాతి నక్షత్రం' కూడా 26 గంటల పాటు ఉండటం విశేషం. ఈ సమయం శుభ కార్యాలకు, ఆధ్యాత్మిక అనుష్ఠానాలకు అత్యంత అనుకూలమైనది. జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం, ఏప్రిల్ 30 రాత్రి నుంచే ఈ పవిత్ర ఘడియలు ప్రారంభమవుతాయి. ఉదయ తిథి ప్రకారం మే 1నే మనం పూర్ణిమగా పరిగణిస్తాం.
చంద్ర దోష నివారణకు అద్భుత అవకాశం
పూర్ణిమ తిథి అంటేనే చంద్రుడికి అంకితం చేయబడిన రోజు. మీ జాతక చక్రంలో చంద్ర మహాదశ నడుస్తున్నా లేదా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నా ఈ రోజున ఉపవాసం ఉండటం మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పేదలకు దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.