గరుడ పురాణం: ఈ 5 పవిత్ర వస్తువులను తాకితే అదృష్టం వరిస్తుందట!

ఇంట్లో ప్రశాంతత, సానుకూల వాతావరణం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం పూజలు, నోములు, వివిధ పరిహారాలను పాటిస్తుంటారు. గరుడ పురాణం మరణానంతర విషయాలకే పరిమితం కాకుండా, సంతోషకరమైన జీవితం గురించి కూడా పలు విషయాలను వివరిస్తుందని ఈ కథనం చెబుతోంది. 

Published on: Sep 10, 2026, 08:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలని, ఎలాంటి ప్రతికూల శక్తి దరిచేరకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఎన్నో రకాల పూజలు, నోములు, పరిహారాలు చేస్తుంటాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితం దక్కదు. అలాంటి సమయాల్లో మన గ్రంథాలు చూపించిన మార్గాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహాపురాణాలలో ఒకైన 'గరుడ పురాణం' కేవలం మరణం గురించే కాకుండా, సంతోషకరమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా గడపాలో వివరిస్తుంది.

గరుడ పురాణం: ఈ 5 పవిత్ర వస్తువులను తాకితే అదృష్టం వరిస్తుందట! (AI)
గరుడ పురాణం: ఈ 5 పవిత్ర వస్తువులను తాకితే అదృష్టం వరిస్తుందట! (AI)

ఈ పవిత్ర గ్రంథంలో మన చుట్టూ ఉండే కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను లేదా జీవులను కేవలం స్పర్శించడం వల్ల జీవితంలోని సకల నష్టాలు, నెగెటివ్ ఎనర్జీ దూరమై అదృష్టం ఎలా వరిస్తుందో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఐదు పవిత్ర విషయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గోమాత దివ్య స్పర్శ - సమస్త పాపహరిణి

హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్ గృహలక్ష్మిగా, తల్లిగా భావిస్తాము. ముక్కోటి దేవతలు ఆవు శరీరంలో కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే మన సంప్రదాయంలో ప్రతి ఇంటిలోనూ మొదటి రొట్టెను గోమాతకు పెట్టే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఎక్కడైనా దారిలో గోమాత కనిపిస్తే నస్కరించి, గోవు పాదాలను తాకడం అత్యంత శుభప్రదమని గరుడ పురాణం చెబుతోంది. గోమాతను లేదా ఆమె పాదాలను స్పర్శించడం వల్ల మనలోని ప్రతికూల శక్తి ఇట్టే తొలగిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఇంట్లో సిరిసంపదలను పెంచుతుంది.

ఆవు పేడ పవిత్రత - సానుకూల శక్తికి ప్రతీక

కాలం మారుతున్న కొద్దీ ఆధునికత పెరిగినప్పటికీ, మన పల్లెల్లో ఇప్పటికీ ఆవు పేడకు ఉన్న ప్రాధాన్యత వేరు. శాస్త్రీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవు పేడ అత్యంత పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. పూర్వం ఏ శుభకార్యం జరగాలన్నా, పూజలు చేయాలన్నా ముందుగా ఇంటిని ఆవు పేడతో అలికేవారు. దీనివల్ల గాలి శుద్ధి అవుతుంది మరియు ఇంట్లోకి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. ఆవు పేడను గౌరవించడం, తాకడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పటికీ లోటు ఉండదని, అన్నపూర్ణాదేవి అనుగ్రహం నిరంతరం ఉంటుందని నమ్ముతారు.

గోమాత పాదాల ధూళి - సకల పుణ్యాల ప్రాప్తి

సాయంత్రం వేళ ఆవులు గోశాల నుంచి లేదా మేత మేసి ఇంటికి తిరిగి వస్తుంటే వాటి కాళ్ల కింద నుంచి లేచే మట్టి ధూళిని 'గోధూళి' అంటారు. ఈ గోధూళి పడటం లేదా దానిని స్పర్శించడం సాక్షాత్ గోదాదేవి లేదా తీర్థయాత్రలు చేసినంతటి పుణ్యాన్ని ఇస్తుందని గరుడ పురాణంలో తేల్చిచెప్పారు. ఈ ధూళిని నుదుట ధరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. పెద్దల కాలం నుంచి ఈ గోధూళికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది.

పంట పొలాలు - రైతు కష్టానికి ప్రతిరూపం

ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో పచ్చని పంట పొలాలు ఒకటి. రైతన్న కష్టానికి ప్రతిరూపమైన ఈ పండిన పంటలను, పొలాలను మనసారా గౌరవించాలి. పంట పొలాలను తాకడం, వాటిని ప్రేమించడం వల్ల అన్నపూర్ణాదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఎన్నడూ తిండికి, డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే ప్రకృతిని, పంటలను ప్రేమించే తత్వం ఉండాలని మన గ్రంథాలు బోధిస్తున్నాయి.

పవిత్ర తులసి చెట్టు - అదృష్టాన్ని తెచ్చే దైవిక మొక్క

హిందూ కుటుంబాలలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజూ స్నానం ఆచరించి తులసి కోటను పూజించడం మన సంస్కృతి. గరుడ పురాణం ప్రకారం తులసి మొక్కను భక్తితో తాకడం, ప్రతిరోజూ నీరు సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం తలుపు తడుస్తుంది. ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున తులసిని పూజించి, ఆమె ఆశీస్సులు తీసుకోవడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More