...
...
Next Story

చాణక్య నీతి.. పనులను రేపటికి వాయిదా వేస్తే.. ప్చ్.. టైమ్ వేస్ట్ చేసేమే అని బాధపడుతారు!

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి మాటలు జీవితంలో ప్రతి సమయంలోనూ ఉపయోగపడతాయి. చాణక్య నీతి చెప్పినట్టుగా పనులను రేపటికి వాయిదా వేసేవారు జీవితంలో ఎదగలేరు.

Published on: Aug 9, 2026, 10:07:53 IST
Advertisement

ఆచార్య చాణక్యుని సూత్రాలు నేటి ఆధునిక జీవితానికి ఎంతో సందర్భోచితమైనవి. మన జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక ఉపదేశాలు ఇచ్చాడు. మనం ఏ కారణం చేత కూడా కొన్ని పనులను వాయిదా వేయకూడదు, అలా చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జీవితంలో మనం పెద్ద కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా చాణక్యుడు హెచ్చరించాడు. భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఏ పనులను వాయిదా వేయకూడదో చాణక్యుడు చెప్పిన విషయాలను చూడండి..

చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్యుని ప్రకారం.. తీసుకున్న రుణాన్ని రేపటికి వాయిదా వేయకూడదు. తీసుకున్న రుణాన్ని వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. రుణాన్ని అలాగే వదిలేస్తే, అది వడ్డీ రూపంలో రోజురోజుకీ పెరిగి, మానసిక ప్రశాంతతను హరించివేస్తుంది. అప్పుల భారం పెరిగేకొద్దీ, వ్యక్తి సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు. అందువల్ల ఆర్థిక విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

శరీరంలో కనిపించే ఏ చిన్న అనారోగ్యాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. రేపు డాక్టరును కలుస్తాను అని చెప్పి చికిత్సను వాయిదా వేయడం ప్రాణాంతకం కావచ్చు. వ్యాధిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే.. అది పెరిగి ధన, ప్రాణ నష్టానికి కారణమవుతుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. వ్యాధి ఇంకా చిన్నదిగా ఉన్నప్పుడే మందు తెచ్చుకోవడం వివేకం.

చిన్న నిప్పురవ్వను కూడా వెంటనే ఆర్పివేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. అది ఇల్లంతా తగలబెట్టేయగలదు. అదేవిధంగా శత్రువును బలహీనుడని భావించి ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు. శత్రువు ప్రణాళికలను ప్రారంభంలోనే భగ్నం చేయాలి. లేకపోతే అవి మీ వినాశనానికి దారితీయవచ్చు.

మంచి పనులు, జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశాలను ఎన్నడూ రేపటికి వాయిదా వేయకూడదు. మంచి పనులు లేదా ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెంటనే చేయాలి. కానీ చెడు పనులు లేదా కోపాన్ని వీలైనంత వరకు వాయిదా వేయాలని చాణక్య నీతి చెబుతోంది. కాలం ఎవరి కోసం ఆగదని, గడిచిపోయిన కాలం తిరిగి రాదని చాణక్యుడు చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe