...
...
Next Story

Chandra Grahan 2026 : చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఏం దానం చేస్తే పుణ్యం దక్కుతుంది?

Lunar Eclipse Today : మార్చి 3 దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం కనిపిస్తుంది. సాయంత్రం గ్రహణం ముగుస్తుంది. గ్రంథాల ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత మంచి జరగాలంటే కొన్ని దానాలు చేయాలి.

Published on: Mar 03, 2026 04:01 PM IST
Advertisement

2026లో చంద్రగ్రహణం మార్చి 3న సంభవిస్తుంది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. మతపరమైన, పౌరాణిక నమ్మకాల ప్రకారం, గ్రహణ కాలం చాలా సున్నితమైన, ప్రభావవంతమైన సమయంగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో వాతావరణ శక్తిలో మార్పు ఉంటుందని, దీని కారణంగా ప్రతికూలత పెరుగుతుందని చెబుతుంటారు.

చంద్రగ్రహణం తర్వాత ఏం దానం చేయాలి?
చంద్రగ్రహణం తర్వాత ఏం దానం చేయాలి?

ముఖ్యంగా చంద్రగ్రహణం తర్వాత స్నానం చేయడం, దానం చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఇది మానసిక అశాంతి, ప్రతికూలత, బాధలను తగ్గిస్తుందని, కుటుంబంలో ఆనందం, శాంతిని కొనసాగిస్తుందని నమ్ముతారు. గ్రహణం విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 48 నిమిషాల తర్వాత చేయాలి. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

పౌరాణిక నమ్మకాల ప్రకారం, చంద్రగ్రహణం తర్వాత గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయడం ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి దేవుడిని స్మరించాలి. దీని తర్వాత మాత్రమే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆచారం శారీరక, మానసిక శుద్ధిని సూచిస్తుంది.

  • చంద్రుడు తెలుపు రంగు, సున్నితమైన స్వభావానికి సూచికగా చెబుతుంటారు. అందువల్ల చంద్రగ్రహణం తర్వాత తెల్లని వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతమైనదిగా అంటారు. బాధలను తగ్గించడానికి బియ్యం దానం చేస్తారు. బియ్యం దానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుతుందని మత విశ్వాసం.
  • పాలు, పెరుగు, ఇతర తెల్లటి పదార్థాలను పవిత్రంగా పరిగణిస్తారు. గ్రహణం తర్వాత వాటిని దానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంటికి సానుకూలత వస్తుంది. అవసరమైన వారికి పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణిస్తారు.
  • తెల్లని బట్టలు స్వచ్ఛత, సరళతకు చిహ్నంగా భావిస్తారు. చంద్రగ్రహణం తర్వాత తెల్లని బట్టలు దానం చేయడం వల్ల చంద్రుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇంకా వెండిని చంద్రునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా కూడా భావిస్తారు. మీ స్తోమతను బట్టి వెండి నాణెం లేదా చిన్న వెండి నగలను దానం చేయడం కూడా శుభమే.
  • గ్రహణం తర్వాత ఆహారం, తీపి పదార్థాల దానం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా తెల్లటి తీపి పదార్థాలను దానం చేయడం శుభం. దీనివల్ల ఇంట్లో ఆహారం, సంపద పెరుగుతుందని, పేదరికం తొలగిపోతుందని నమ్ముతారు. పేదలకు ఆహారం పెట్టడం అతిపెద్ద దానంగా చెబుతారు. ఇది అనేక ప్రయోజనాలను ఇస్తుంది. మత సంప్రదాయాల ప్రకారం, దానం ఎల్లప్పుడూ భక్తి, వినయం, సామర్థ్యం ప్రకారం చేయాలి. ప్రదర్శన కోసం చేసే దానం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. అయితే నిజమైన హృదయంతో చేసే చిన్న దానం కూడా చాలా పుణ్యం దక్కేలా చేస్తుంది.
  • చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఒక రొట్టెను తీసుకొని ఆవుకు తినిపించండి. రాత్రిపూట ఇది సాధ్యం కాకపోతే ఉదయం తినిపించండి. అలా చేయడం వల్ల గ్రహణం దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe