బుధ సంచారం : జులై 24 నుంచి ఈ రాశుల జాతకం మారబోతోంది - ఊహించని ధనలాభం!
జులై 24న బుధ గ్రహం రుజుమార్గంలోకి రాబోతోంది. వ్యాపారం, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల వారికి ఈ మార్పు అద్భుతమైన ప్రయోజనాలు తెచ్చిపెట్టనుంది.
జ్యోతిషశాస్త్రంలో బుధుడికి అత్యంత ప్రాధాన్యత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. బుధ గ్రహాన్ని వివేకం, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్ మరియు తార్కిక ఆలోచనా శక్తికి ప్రతీకగా పండితులు పరిగణిస్తారు. జులై 24వ తేదీన బుధుడు తన కదలికను మార్చుకోనున్నాడు.

సాధారణంగా బుధుడు తిరోగమనం చెందినప్పుడు చాలామంది నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర తడబాటుకు గురవుతారు. ఉద్యోగాల్లో అపార్థాలు రావడం, వ్యాపార లావాదేవీల్లో అడ్డంకులు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే…. జులై 24న బుధుడు తిరిగి నేరుగా సంచరించటం ప్రారంభించగానే… ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి.
బుధుడి రుజుమార్గ ప్రయాణం వల్ల జాతకంలో స్పష్టత పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్, వ్యాపార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి ఈ మార్పు అద్భుతమైన ఫలాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగై, కెరీర్లో పురోగతి సాధించేందుకు బలమైన యోగాలు రూపుదిద్దుకుంటాయి.
మేష రాశి :
బుధుడి కదలికలో మార్పు వల్ల మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాటకారితనంతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. వైరి వర్గాలపై మీదే పైచేయి అవుతుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిగా ఓపిక వహించడం అవసరం. పనికిరాని వాదనలు, అనవసర వివాదాలకు దూరంగా ఉంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
మిథున రాశి :
మిథున రాశి అధిపతి స్వయంగా బుధుడే కావడంతో ఈ రాశి వారికి విశేషమైన లాభాలు కలగనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది. కొత్త ఆస్తులు లేదా నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి.
సింహ రాశి :
సింహ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో తీసుకునే కీలక నిర్ణయాలు, ఊహించని పెట్టుబడులు లాభాల బాట పట్టిస్తాయి. నూతన ఒప్పందాలు కలసివస్తాయి. ఫైనాన్షియల్గా పరిస్థితులు చాలా బలంగా మారుతాయి.
కన్యా రాశి :
కన్యా రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు, విశేషమైన ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైఅధికారుల మద్దతుతో ఆశించిన స్థానానికి చేరుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

