...
...
Next Story

గరుడ పురాణం: మీ జీవితాన్ని నాశనం చేసే ఈ ఐదు రకాల వ్యక్తులకు దూరంగా ఉండండి!

గరుడ పురాణం ప్రకారం, జీవితాన్ని నరకంగా మార్చగల 5 మందికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎవరి నుంచి దూరంగా ఉండటం మంచిదో 5 మంది తెలుసుకోండి.

Published on: Jul 2, 2026, 08:01:06 IST
Advertisement

జీవితంలో ప్రశాంతత, పురోగతి ఉండాలంటే మనం ఎవరితో సమయం గడుపుతున్నామనేది కీలకం. దుష్ట సహవాసం మనిషి ఆలోచనా దృక్పథాన్ని నెమ్మదిగా మారుస్తుంది. అది వ్యక్తిగత నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గరుడ పురాణంలో పేర్కొన్న కొన్ని రకాల వ్యక్తులు మన జీవితంలోకి వస్తే అశాంతి, ఒత్తిడి తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిని గుర్తించి, వారితో సాధ్యమైనంత వరకు దూరం పాటించడమే శ్రేయస్కరం.

గరుడ పురాణం ప్రకారం ఇలాంటి వారికి దూరంగా ఉండండి:

1. పరుల నిందలు చేసేవారు:

garud puran
garud puran

కొంతమందికి ఎక్కడ ఉన్నా పక్కవారిని విమర్శించడమే పని. ఇతరుల వ్యక్తిగత విషయాలను, రహస్యాలను బయటపెట్టడం వీరి నైజం. మీ ముందు పక్కవారిని విమర్శించే వ్యక్తి, మీరు వెళ్లిన తర్వాత మీ గురించి వేరే వారి దగ్గర ఇలాగే మాట్లాడతారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలాంటి వ్యక్తులు బంధాల విశ్వసనీయతను దెబ్బతీస్తారు.

2. స్వార్థపరులు:

అవసరానికి మాత్రమే గుర్తుకొచ్చే వ్యక్తులు మన జీవితంలో చాలా మంది ఉంటారు. వారికి పని ఉన్నప్పుడు తీయగా మాట్లాడుతారు, మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడా కనిపించరు. స్వార్థం కోసం మాత్రమే స్నేహం చేసే వ్యక్తుల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు సరే కదా, సమయం వృథా అవుతుంది.

3. కోపిష్ఠులు:

కోపం అందరికీ వస్తుంది, కానీ ప్రతి చిన్న విషయానికి ఆవేశపడేవారు, అదుపు తప్పేవారితో బంధం కొనసాగించడం కష్టతరమైన పని. వీరి ప్రవర్తన వల్ల ఇంట్లో, కార్యాలయంలో అనవసరమైన అశాంతి, ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. నిత్యం ఒత్తిడిని మోసేవారితో కన్నా ఒంటరిగా ఉండటమే మేలు.

4. అహంకారులు:

తమకు మించిన వారు లేరని భావించే అహంకారులతో స్నేహం ప్రమాదకరం. ఇతరుల మాటకు విలువ ఇవ్వని వీరు, తమ తప్పులను ఒప్పుకోరు. అహంకారం నిండిన వ్యక్తులతో ఎక్కువ కాలం బంధాన్ని కొనసాగిస్తే, అది మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

5. లోభులు (పిసినారులు/లబ్ధి కోరులు):

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe